Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్జీమర్స్.. చిన్నగా మొదలై, చివరికి గతాన్నే మరిచిపోయేలా చేసే ప్రమాదకర వ్యాధి. ఒకప్పుడు వ ద్ధుల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు 30 నుంచి 50 ఏళ్ల లోపువారిలో కూడా ఏర్పడుతోంది. మరి ఈ అల్జీమర్స్ బారిన పడకుండా ఉండాలంటే... ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
తినకూడనివి: ఎర్రగా ఉండే మాంసంలో ఐరన్ ఎక్కువ. ఇది ఆరోగ్యానికి మంచిదే. కానీ, అతిగా ఐరన్ తినడం వల్ల మెదడులో వయస్సును పెంచే గ్రంథి యాక్టివ్ అవుతుంది. మొతాదు మించిన ఐరన్ వల్ల మెదడు వయస్సు పెంచేస్తుంది. సాధారణ ఆహారం తినేవారితో పోల్చితే పిండి పదార్థాలు, చక్కెర అతిగా తీసుకునేవారికి అల్జీమర్స్ వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు అధికం. నూనెలో బాగా వేయించిన ఆహారం, ఫ్రెండ్ ఫ్రైస్, మాంసం, అమెరికన్ చీజ్ తదితర పదార్థాల వల్ల అల్జీమర్స్ ఏర్పడతాయి. మైక్రోఓవెన్లో ఉడికించడం వల్ల ఆల్జిమర్స్ ఏర్పడటానికి కారణమయ్యే 'బీటా అమైలాయిడ్' అనే విషతుల్య ప్రోటీన్లు ఎక్కువ అవుతాయి. శుద్ధిచేసిన ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, బయట లభించే శుద్ధి చేయని కూరగాయలు, పండ్ల ఆల్జీమర్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. వీటిపై ఉండే పురుగు మందుల అవశేషాల వల్ల మెదడుకు ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తినాల్సినవి: ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వల్ల మనకు కలిగే ఉపయోగం.. జ్ఞాపకశక్తి పెరగడం. ఈ పోషక పదార్థం ఉన్న ఆహారాలను తినడం వల్ల యాక్టివ్గా మారుతారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎందులో అధికంగా ఉంటాయనేది ప్రశ్న. వాల్నట్స్, చెస్ట్నట్స్, బాదంపప్పు, పల్లీలు, అవకాడోలు, గుమ్మడికాయ విత్తనాలు, ఆలివ్ ఆయిల్, అవిసె గింజలు, కోడిగుడ్లు, కాలిఫ్లవర్, చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మన శరీరానికి పోషణ కూడా లభిస్తుంది. ు