Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్ని పండ్లు తింటున్నా.. ఈ పండ్లను మాత్రం మిస్ అవొవ్వద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్లు శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. అలాగే ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు వీటిలో ఎన్నో ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం...
ఫైనాపిల్: 'బ్రొమిలైన్' అనే ఎంజైమ్ కలిగిన పండ్లు తక్కువ. అది ఫౖౖెనాపిల్లో ఉంటుంది. శరీరంలోని కొవ్వుల్ని, ప్రొటీన్లను త్వరగా అరిగేందుకు సహాయపడుతుంది ఎంజైమ్. ఇంకా ఫౖౖెనాపిల్లో విటమిన్లు, ఖనిజాలకైతే కొదవ లేదు. విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, పాస్పరస్, పొటాషియం వంటివి అధికంగా ఉంటాయి. ఈ పండు జలుబు నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఎముకల పటిష్టానికి తోడ్పడుతుంది. పళ్లు మరింత గట్టిపడేందుకు ఉపకరిస్తుంది.
పుచ్చకాయ: అత్యధిక పీచు, నీళ్లు కలిగిన పండ్లలో తిరుగులేనిది వాటర్మిలాన్. వడదెబ్బ నుంచి కాపాడటంలో దీని ప్రాముఖ్యం ఎనలేనిది. మరీ ముఖ్యమైన ప్రయోజనం 'లైకోపిన్' అనే ఔషధగుణం కలిగి ఉండటం. ఇది ముఖ్యంగా చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంద్ి. పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్, విటమిన్ ఎ, బి6, సి, కాల్షియం, పీచు వంటి పోషకాలు పుచ్చకాయలో మాత్రమే దొరకడం సాధ్యం. జుట్టు రాలడం, అజీర్తి, కనుచూపు మందగింపు వంటి సమస్యలను తగ్గిస్తుంది. గుండె జబ్బులను అడ్డుకునే శక్తి కూడా దీనికుంది.
కొబ్బరి నీళ్లు: తాగేందుకు రుచిగా అనిపించవు కాని.. ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరం. ఏ ఇతర పండ్లు అందించనన్ని పోషకాలు కొబ్బరి నీళ్లు అందిస్తాయి. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోటైట్లు సమకూరుతాయి. శరీరం కూడా వెంటనే చల్లబడుతుంది. తక్షణశక్తిని అందించడంలో కొబ్బరి నీళ్లు బాగా పని చేస్తాయి. మూత్రపిండాలను శుభ్రపరుస్తాయి, కిడ్నీలో రాళ్లను కూడా ఏర్పడనియవు. యూరినరీ ఇన్ఫెక్షన్స్ను రానివ్వవు. రక్తంలో ప్లాస్మా తగ్గకుండా చూస్తుంది కొబ్బరి. ఎర్ర రక్త కణాల సంఖ్య పెంచుతుంది. ు