Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మృదువైన చర్మం కోసం ఇంట్లో అందు బాటులో ఉండే పదార్థాలు ఎంతో ఉపయోగ పడుతాయి.
- బియ్యపు పిండిలో కొంచెం పాలు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమి షాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల ముఖం మృదువు గా మారుతుంది.
- బ్రెడ్ను ముక్కలుగా చేసి పేస్టులా తయారుచేయాలి. ఈ పేస్టులో కొంచెం మీగడ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికిఅప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. తరుచూ ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
- గుడ్డుసొన, అరటిగుజ్జు, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ పై పట్టించాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా
చేయడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు తొలిగిపోతాయి.