Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొప్పాయి గుజ్జులో కొద్దిగా పెరుగు, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు తొలగిపోయి తాజాగా మారుతుంది.
పాలలో కొద్దిగా చక్కెర, ఉప్పు కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
బార్లీ గింజలను పొడిగా చేసుకుని అందులో నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన ముఖంపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి.
తేనెలోని యాంటీ ఆక్సిడెంట్స్ అందానికి చాలా ఉపయోగపడతాయి. అందువలన తేనెలో కొద్దిగా పాలు, ఉప్పు, వంటసోడా కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోయి తాజాగా మారుతుంది.