Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి సహజంగా లభించే ప్రతిఒక్క పదార్థంలోనూ మానవ శరీరానికి అవసరమయ్యే పోషకాలు నిల్వవుంటాయి. అలా లభించే వాటిలో పల్లీలు ఒకటి! వీటిలో ఎన్నోరకాల అద్భుతమైన పోషకాలు దాగి వున్నాయి. మధుమేహం, గుండెపోటు, గర్భాశయ సమస్యలు, కేన్సర్, ఒబిసిటీ తదితర సమస్యలను చెక్ పెట్టే ఔషధాలు వీటిల్లో వుంటాయి.
పల్లీల్లోని పోషకాలు వాటి పనితీరు :
మాంగనీస్: వీటిలో మాంగనీస్ అధిక మోతాదులో వుంటుంది. ఇది రక్తంలోని పిండి పదార్థాల కొవ్వును క్రమబద్ధీకరిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. తద్వారా డయాబెటిస్ వ్యాధిని దూరం చేసుకోవచ్చు. పిల్లలు, వృద్ధులు రోజూ పల్లీలు తీసుకుంటే.. ఎముకల వ్యాధుల నుంచి కూడా తప్పించుకోవచ్చునని, మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజుకు గుప్పెడు పల్లీలు తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
యాంటీ ఆక్సిడెంట్స్: ఇవి గుండెపోటును నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రోజూ 30 గ్రాముల పల్లీలు తింటే హార్ట్ వాల్స్ను భద్రపరిచినట్లు అవుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ శరీర బరువును తగ్గిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.. వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. జ్ఞాపకశక్తిని వృద్ధి చేయడంలో తమవంతు కృషి చేస్తాయి. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి. మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయని నిపుణులు అంటున్నారు.
ఫోలిక్ యాసిడ్: ఇది పల్లీలో పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమంగా తీసుకుంటే గర్భాశయ సమస్యలుండవు. రోజూ పల్లీలు తింటే.. గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో గడ్డలు, సంతానలేమి వంటి సమస్యల నుంచి బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు.
మొత్తానికి ఈ పల్లీల్లో మహిళలకు కావలసిన ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలతోపాటు విటమిన్ ఇ1, ఇ12, నియాసిన్, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి.. ఈ వీటిని ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యంగా వుండవచ్చు.