Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా మన శరీర తత్వాన్ని బట్టి, తినే ఆహారాన్ని బట్టి, సూర్యరశ్మి చర్మంపై ఎక్కువుగా పడటం వలన మొటిమలు వస్తూ ఉంటాయి. ఇవి ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి. ముఖముపై నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. అందుకే బయటకు వెళ్ళేటప్పుడు చర్మానికి సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేయడం మంచిది. అలాగే కొన్ని గృహ చిట్కాలను పాటించడం వల్ల మొటిమల నుంచి విముక్తి పొందవచ్చు అవి ఏమిటో చూద్దాం.
- ఒక టమాటా తీసుకొని పేస్టు చేసి టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత వేడి నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి.
- కలబంద గుజ్జుని తీసి 5 నిమిషముల పాటు ఎండపెట్టాలి. తరువాత దానిలో ఎండిన నిమ్మపండు రసాన్ని 5-6 చుక్కలు కలపాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి.
- ఒక ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి, మిక్సర్ సహాయంతో పేస్టు చేయాలి. తరువాత ఆ పేస్టు నుంచి నీటిని వడపోసి పిప్పిని మాత్రమే ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషముల తరువాత ముఖాన్ని నీటితో కడగాలి. ఇలా వారానికి 3సార్లు చొప్పున చేయడం వలన ముఖంపై మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది.
- రెండు టేబుల్ స్పూన్ల గంధపు పొడిని తీసుకొని సరిపడే గులాబీ నీటిని కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఎండిన తరువాత నీటితో కడగాలి. ఇది చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది
- చిటికెడు పసుపు తీసుకుని దానిలో నిమ్మరసాన్ని కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి నీటితో కడగాలి. దీని వల్ల ముఖముపై మచ్చలు తొలగిపోతాయి.