Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిడ్డకు బిడ్డకు మధ్య కనీసం రెండు సంవత్సరాలు తేడా ఉండేట్టు చూసుకోక పోతే తల్లికి ఆస్టియోపొరోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు యేల్స్ విశ్వవిద్యాయానికి చెందిన పరిశోధకులు. ఆస్టియోపొరోసిస్ కారణంగా శరీరంలో క్యాల్షియం, విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. దాంతో ఎముకలు కణజాలాన్ని కోల్పోయి పెళుసుగా తయారవుతాయట. ఈ పరిశోధన కోసం ఆస్టియోపొరోసిస్తో బాధపడుతున్న మెనోపాజ్ దశకు చేరని 239మంది మహిళలని, అలాగే ఎటువంటి ఎముకల బలహీనతలూ లేని298మందిని ఎంచుకున్నారు. కాన్పుకు కాన్పుకు మధ్య కనీసం సంవత్సరమైనా వ్యవధి లేనివాళ్లు ఈ వ్యాధి బారినపడే అవకాశం నాలుగురెట్లు అధికంగానే ఉందని ఆ పరిశోధనలో వెల్లడైంది. మెనోపాజ్ దశ కంటే ముందే ఎముకలు బలహీనతపై చేసిన ఈ పరిశోధన లో ప్రెగెన్సీల మధ్య వ్యవధితో పాటు బిడ్డకి పాలివ్వడం, మొదటి ప్రెగెన్సీ అప్పుడు తల్లి వయసు వంటి అంశాలు ప్రభావాన్ని చూపుతాయి అని వెల్లడైంది. ఈ పరిశోధన లో భాగంగా మెనోపాజ్ దశకు చేరుకోని మహిళలను పరీక్షించగా తక్కువ వయసులో తల్లయిన వాళ్లలో ఆస్టియోపొరోసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడైంది. ు