Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలం వచ్చిందంటే చాలు, అప్పటివరకూ మదువుగా ఉండే చర్మం పగిలి మంట పుడుతుంటుంది. దీనికి కలబంద మంచి పరిష్కారమనీ ఇది మాయిశ్చరైజర్, క్రీమ్, నేచురల్ క్లెన్సర్, స్క్రబ్లా పనిచేస్తుందనీ అంటున్నారు సౌందర్యనిపుణులు. కలబందలో ఉండే విటమిన్లు, ఖనిజాలూ చర్మాన్ని మదువుగా మారుస్తాయి. మెరిసేలా చేస్తాయి.
- ఒక చెంచా కలబంద రసంలో సగం చెంచా ఆలివ్నూనె, ఒక చెంచా ఓట్మీల్ కలిపి మెత్తని పేస్టులా చేసి ముఖానికి, చర్మానికి పట్టించి చల్లని నీళ్లతో కడిగేయాలి. దీనివల్ల చర్మం మీద ఉన్న మతకణాలన్నీ తొలగిపోయి చర్మం మదువుగా మారుతుంది.
- ఒక చెంచా కలబంద గుజ్జులో రెండు, మూడు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి మర్దన చేసి ఓ గంట తరవాత కడిగేయాలి. దీనివల్ల ముఖం మీద ఉన్న మచ్చలు పోయి చర్మం కాంతిమంతంగా మారుతుంది.
- అలోవెరా గుజ్జుని పేస్టులా చేసి అందులో కాస్త తేనె కలిపి ముఖానికి మాస్క్లా వేసి 20 నిమిషాల తరవాత కడిగేసినా మంచిదే... చర్మం మెరుస్తుంటుంది.
- కీరాముక్కలు, కలబంద గుజ్జు, పెరుగు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బి రెండుమూడు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి అరగంట తరవాత కడిగేసినా పొడిబారిపోయిన చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. శ