Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెక్నాలజీ అంచనాలకు మించి దాటిపోతోంది. ఒకదానికి మించి మరొకటి కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి. నిత్యజీవితంలో టెక్నాలజీ ఒక సమభాగం అయిపోయింది. వీటి ఉపయోగం లేనిదే పనులు అస్సలు జరగవు. అయితే చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఈ టెక్నాలజీకి బానిసలుగా మారిపోయారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఒక జీవనాధారాంగా ఈ టెక్నాలజీ మారిపోయింది.
రకరకాల గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్స్, ల్యాప్ టాప్ ఇలా చాలా రకాల టెక్నాలజీ ప్రొడక్ట్స్ వున్నాయి. ఇవి సామాజానికి ఎంతో ఉపయోగపడే పరికరాలు. సెల్ ఫోన్లు దూరప్రాంతాల్లో వున్నవారితో సంభాషించుకోవడానికి పనికొస్తుంది. అయితే నేటి యువకులు ఏవో కొత్త కొత్త యాప్స్ వచ్చాయని ఎడతెరిపి లేకుండా వీటిని వాడుతున్నారు. ల్యాప్ టాప్ లు ఆఫీసుకు సంబంధించిన కార్యక్రమాలను, పనులను నిర్వర్తించుకోవడానికి ఉపయోగిస్తారు. అలాగే పాటలు వినడానికి ఐప్యాడ్లు ఇంకా రకరకాలు గ్యాడ్జెట్స్ ఎన్నో మార్కెట్లలో లభ్యమవుతున్నాయి.
అయితే ఇటువంటి గ్యాడ్జెట్స్ ను నిరంతరం వాడటం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాల కొత్తకొత్త వ్యాధులు వ్యాపిస్తున్నాయి. విద్యార్థులు ఈ గ్యాడ్జెట్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో తమ విలువైన విద్యను కోల్పోతున్నారు. అలాగే ఎక్కడైనా బయటికి వెళ్లినప్పుడు కూడా వీటిని వాడుతుండటంతో యాక్సిడెంట్లు కూడా సంభవిస్తున్నాయి. నలుగరిలో సేఫ్టీ కూడా లోపిస్తోంది. అందుకే వాటితో జర జాగ్రత్తగా ఉండమంటున్నారు నిపుణులు.