Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలంలో కొంతమందికి పాదాలు, మడమలు పగిలి రక్తం వెలికి రావడం, దాని తాలూకు నొప్పి, మంటలు కొందరికి నరకాన్ని తలపిస్తాయి. నిజానికి ఈ సమస్యను చిన్నపాటి చిట్కా వైద్యాలతోనే అధిగమించవచ్చు. ముఖ్యంగా చలి కాలమంతా రోజుకు రెండు సార్లు మాయిశ్చరైజర్తో పాదాల్ని శుభ్రం చేసుకోవడం ఒక పద్ధతి. ఇలా చేయడం వల్ల పాదాలు ఎండిపోవడం గానీ, గరుకుగా మారడం గానీ ఉండదు. గోరు వెచ్చని నీళ్లల్లో కొంచెం తేనె వేసి, ఆ నీళ్లల్లో పాదాలు ఉంచితే పాదాల పగుళ్లు పోయి మృదువుగా మారతాయి. బ్యాక్టీరియా, సెప్టిక్ సమస్యల నుంచి మడమలు, పాదాల్ని కాపాడుకోవడానికి కింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
తేనెలో మాయిశ్చరైజర్గా ఉపయోగపడే గుణాలు కూడా ఉన్నాయి. పాదాల పరిరక్షణలో ఆలివ్ ఆయిల్ పాత్ర కూడా కీలకలమే. పాదాలు పగుళ్లు బారిన చోట ఆలివ్ ఆయిల్తో మర్దనా చేస్తే ఆ భాగాల్లో రక్తప్రసరణ పెరుగుతుంది. చాలామంది స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ మర్దన చేసుకోవడంలోని ఉద్దేశం ఇదే. వీటితో పాటు చలికాలంలో పాదాలకు కాటన్ సాక్స్ వాడటం చాలా మేలు. ఇవి కాలుష్యాల నుంచి, దుమ్ము, ధూళి నుంచి కాపాడతాయి. పాదాల్ని కాపాడటంలో హెర్బల్ క్రీములు బాగా ఉపయోగ పడతాయి. ఈ క్రీమును గోరువెచ్చని నీళ్లతో కలిపి పాదాలు పగిలిన చోట పూయాలి. ఉదయం వేళల్లోనూ, నిద్రకు ముందు ఇలా రోజుకు రెండు సార్లు ఈ క్రీమును వాడితే మడమలు, పాదాల బాధలు చాలా వరకు తగ్గిపోతాయి.