Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వానాకాలం, చలికాలం తాగబుద్ధి కాదు. తాగకపోయినా ఏం కాదనే ఫీలింగ్ మనలో ఉంటుంది. కాలమేదైనా... శరీరం హైడ్రేటెడ్గా ఉండాలంటే నీరు తప్పక కావాల్సిందే! అయితే నీరు ఎంత తాగాలి? ఈ విషయంలో ఎంతోమందికి ఎన్నో సందేహాలు. దానికి సమాధానం ఇది!
మానవ శరీరంలో 70 నుంచి 75శాతం నీరే నిండి ఉంటుంది. ఇది శరీరం సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. బ్రెయిన్సెల్స్లో కూడా 75శాతం నీరు ఉంటుంది. కండరాల్లో 75శాతం నీరు ంటుంది. బోన్స్లో 25శాతం, రక్తంలో 82శాతం ఉంటుంది. మొత్తంగా దేహమంతా నీటితో నిండిపోయి ఉంటుంది. అలాంటిది ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నీళ్లు తాగకుండా ఉంటే ఎలా ఉంటుంది. అందుకే రాత్రంతా నీళ్లు తాగం కాబట్టి ఉదయం లేవగానే పరిగడుపున ఓ పెద్దగ్లాసెడు మంచినీళ్లు తాగాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి.
నీరు జీవక్రియను వృద్ధి పరుస్తుంది. టాక్సిన్స్ని బయటికి పంపిస్తుంది. అంతేకాదు.. బ్రెయిన్లో 75శాతం నీరు ఉంటుంది. మీరు సరిగ్గా నీళ్లు తాగకపోవడం వల్ల... బ్రెయిన్ కూడా డ్రైగా మారిపోతుంది. ఉదయం నీళ్లు తాగడం వల్ల కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. దాంతో మీరు ఆహా రం తక్కువగా తీసుకుంటారు. దీంతో ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు.
నీళ్లు శరీరంలోని టాక్సిన్స్ను బయటికి పంపించి వేస్తాయి. దీంతో మీ చర్మానికి కాంతి వస్తుంది. ఉదయమే నీళ్లు తాగడం వల్ల కండరాలు, రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. గొంతు వ్యాధులు, క్యాన్సర్, కంటి వ్యాధులు, మూత్ర, కిడ్నీ సంబంధిత వ్యాధులు రావు. టీబీ, ఆర్థ్రైటిస్ వంటివి కూడా రాకుండా నీళ్లు కాపాడతాయి. ఉదయం పూట వ్యాయామం చేసే అలవాటు ఉన్న వాళ్లు చాలా ఎనర్జీ కోల్పోతుంటారు. అటువంటి వాళ్లకు ఒక లీటర్ మంచి నీళ్లు శరీరానికి ప్రొటీన్స్ బాగా అందేలా చూస్తాయి. కోల్పోయిన ఎనర్జీని తిరిగి తెస్తాయి.