Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మితిమీరిన వాహనాల రద్దీ, పరిశ్రమల నుంచి వచ్చే పొగ నగరాల్లో గాలిని విపరీతంగా కలుషితం చేస్తున్నాయి. ఈ సమస్యను దష్టిలో ఉంచుకుని నగరవాసులకు మంచి గాలిని అందించే ఉద్దేశంతో గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్ నగరపాలక సంస్థ (ఏఎంసీ) వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. అదే 'ఆక్సిజన్ పార్కు', ప్రాణవాయువును అధికమొత్తంలో విడుదల చేసే చెట్లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కన్నమాట. అహ్మదాబాద్లో కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలైన గుజరాత్ హౌసింగ్ బోర్డు- బాపూనగర్ల సమీపంలో 2015లో దీన్ని ప్రారంభించారు. దాదాపు నాలుగెకరాల స్థలంలో, తొమ్మిది వందలకు పైగా చెట్లను ఇందులో నాటారు. పెద్దమొత్తంలో ఆక్సిజన్తో పాటు నీడనూ ఇచ్చే రావి, మర్రి, వేపలాంటి చెట్లను 60 శాతం స్థలంలో పెంచితే, మరో 15 శాతం స్థలాన్ని పూల చెట్లకు కేటాయించారు. మిగతా చోటు నడకా, ఆటలూ తదితరాలకు. వాన నీటిని నిల్వ ఉంచేందుకు పెద్ద ట్యాంకుతోపాటు, రోజూ చెట్లకు నీళ్లుపోసేందుకు పెద్ద బోర్కూడా ఉంది. నడవడంతో పాటూ స్వచ్ఛమైన గాలినీ పీల్చుకోవచ్చన్న ఉద్దేశంతో ఇక్కడికి రోజుకి 500 నుంచి 700 మంది దాకా వస్తున్నారు.