Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈరోజుల్లో అన్ని వయసుల వారికీ కంటిచూపు మందగిస్తోంది. అయితే ముందుచూపుతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నేత్ర సమస్యలు అంత త్వరగా దరిచేరవు.
- తాజా ఆకుకూరలు, కూరగాయలు చాలా ముఖ్యం. పాలకూర, తోటకూర, చుక్కకూర వంటివన్నీ తరచూ తింటుండాలి. విటమిన్-ఇ చేపల్లో ఎక్కువ. అన్ని సీజన్లలోను చేపలు దొరుకుతాయి కాబట్టి.. వీటిని తీసుకోవచ్చు. అయితే చేపలతో వేపుళ్లు కాకుండా.. కూరలు చేసుకు తినడం వల్ల చక్కటి ఫలితం లభిస్తుంది. కోడిగుడ్లు, గింజలు, పప్పుధాన్యాలు, బీన్స్, ఆరంజ్లతోపాటు సిట్రస్ జాతికి చెందిన పండ్లను తప్పక తీసుకోవాలి.
- ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, విటమిన్ సి, ఇ వంటివీ తీసుకోవాలి. మీ శరీరంలో ఇవి తక్కువగా ఉన్నాయేమో ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకుంటే మంచిది.
- కంటిచూపుకు ఒబెసిటీకి సంబంధం ఉంది. అందుకే బరువు పెరగకుండా చూసుకోవాలి. బరువు పెరిగితే బీపీ, షుగర్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటి వల్ల నేత్ర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కనీసం ఆర్నెళ్లకు ఒకసారి అయినా బరువును చెక్ చేసుకోవాలి.
- వేసవిలో ఎండలు మండిపోతున్నప్పుడు సన్గ్లాసెస్ పెట్టుకుని బయటికి వెళ్లండి. గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల సూర్యుని నుంచి వచ్చే ఆల్ట్రావయలెట్ కిరణాల నుంచి తప్పించుకోవచ్చు.
- గ్లాసెస్ పెట్టుకోవడం కండ్లకు సురక్షితం. గాలిలోని దుమ్ముధూళి కణాలు, పొగ, ఇతరత్రా కాలుష్యం కండ్లను తాకదు. దీనివల్ల ఎర్రగా మారవు. తొందరగా అలసిపోవు.
- ఆఫీసుల్లో కూర్చుని కంప్యూటర్ మీద గంటల తరబడి పనిచేసేవాళ్లు.. కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అద్దాలు లేకుండా కంప్యూటర్ మీద పని చేస్తే.. కండ్లు త్వరగా అలసిపోతాయి. చూపు బ్లర్గా కనిపిస్తుంది. పొడిగా మారిపోతాయి. తలనొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పిలతో పాటు భుజాలు లాగేస్తాయి. అందుకే కంప్యూటర్పై పనిచేసేపుడు ప్రతి రెండు గంటలకు ఒకసారి కండ్లకు విశ్రాంతిని ఇవ్వాలి. పదిహేను నిమిషాల పాటు కండ్లు మూసుకుంటే మంచిది. కంప్యూటర్ మానిటర్కు కాస్త డిస్టెన్స్ మెయింటెన్ చేయాలి.