Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పసుపులో సి, ఇ, కె, బి6 వంటి విటమిన్లు, రాగి, ఇనుము, జింక్, పొటాషియం, సోడియం, నియాసిన్, కాల్షియం, మాంసకృత్తులు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధుల బారినపడకుండా కాపాడుతాయి. అంతేకాదు.. సూక్ష్మ క్రిముల్ని అరికట్టే గుణం పసుపులో అధికం. ఇది క్రిమిసంహారకంగా పనిచేసి అంటువ్యాధుల నుంచి కాపాడుతుంది. అందుకనే పసుపు వాడే ఇంట్లో వ్యాధుల బారిన పడేవాళ్ల సంఖ్య తక్కువగా ఉంటుందని చెబుతారు.
ఙ గ్లాసుడు పాలల్లో అయినా, వేడి నీళ్లలో అయినా కాస్తంత పసుపు వేసుకుని తాగితే జ్వరం, జలుబు, దగ్గు, కఫం, తలనొప్పి, కడుపునొప్పి, ఆకలి మందగించడం, అరగకపోవడం వంటి సమస్యలన్నీ దూరమవుతాయి. వేడినీళ్లలో పసుపు వేసి ఆవిరిపడితే ముక్కుదిబ్బడ మటుమాయం. పసుపును రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆయాసం, అంటువ్యాధులు, కాళ్ల పగుళ్లు, పుండ్లు, నోటి సమస్యలు, ఆటలమ్మ, ఉబ్బసం లాంటివి దరిచేరవు.
ఙ ఇవేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులైన గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, మతిమరుపు, షుగర్, గాయాలకు పసుపు మంచిమందు. వివిధ క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడే గుణం పసుపులో ఉందని నిపుణులు పరిశోధనల ద్వారా ధృవపరిచారు.
ఙ ఆయుర్వేద వైద్యంలో పసుపును విరివిగా వాడతారు. దాంతో పాటే సౌందర్య సాధనాల తయారీలో పసుపుకు ప్రముఖమైన స్థానాన్ని కల్పిస్తారు. అంతేకాదు పసుపు తెలివితేటల్ని పెంచుతుందట. ముసలితనంలో కూడా మతిమరుపును రానివ్వదట.