Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్ని రంగాల్లో మహిళలు దూసుకు పోతు న్నారు. ఆయా విభాగాల్లో తమదైన ప్రతిభను కనబరుస్తున్నారు. ఇలా కొందరు పనిచేసు కుంటూ పోవడం తప్ప పక్కవారి గురించి పట్టించుకోరు. తీరా కలిసి పనిచేయాల్సి వచ్చేసరికి కంగారు పడతారు. అలా కలసి పనిచేసే చోట.. వారితో మాట కలపడంలో తప్పేమీ లేదు. ఆఫీసులో సహృద్భావ వాతా వరణం ఎలా పెంపొందిచాలి? నిపుణులు చెబుతున్న కొన్ని సలహాలు!
- పనిచేసేచోట రకరకాల మనుషులుం టారు. వారిలో ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. వారి వేషభాషలు కూడా భిన్నంగా ఉంటాయి. వారిలో కొందరు కొన్నిసార్లు భిన్నంగా, గొప్పగా అనిపిం చొచ్చు. అలాంటి సమయంలో వారిని ప్రశంసించండి. మీకు నచ్చిన విషయాలను వారితో షేర్ చేసుకోండి. అది ఆఫీస్లో మీ మానవ సంబంధాలను వృద్ధి చేస్తుంది.
- ప్రతి మనిషి లోనూ ఏదో కొంత ప్రత్యేకతా , ఏదో కొంత నిపుణతా , కనీసం గానైనా ఉంటుంది ఇట్లా మీరు ఆ ప్రత్యేకతలను గమనించి, వారిని ప్రశంసిస్తే, మీరు వారిలో పాజిటివ్ వైబ్స్, అంటే ఆశావాద దృక్పధాన్ని ఇనుమడింప చేసిన వారవు తారు. అన్ని సార్లు అప్పియరెన్స్ గురించే కాకుండా... చేసే ఉద్యోగంలో వాళ్ల పనితీరు నచ్చితే అభినందనలు తెలపండి.
- ఆ ప్రశంసలు సహజంగా, హృదయ పూర్వ కంగా ఉండాలి! ఇట్లా మీరు ఇతర ఉద్యోగు లను ప్రశంసిస్తే, మానవ సహజమైన కృతజ్ఞతాభావం వారిలో మీ మీద వారికి ఏర్పడుతుంది. అంతే కాక మీరు పని చేసే చోట మీ మానవ సంబంధాలు కూడా మెరుగు పడతాయి.
- అయితే యాంత్రికంగా, వారిని పొగ డాలనే ఉద్దేశంతో ప్రశంసిస్తే ఇట్టే తెలిసి పోతుంది. కాబట్టి ప్రశంస విషయంలోనూ నిజాయితీగా ఉండండి. ఇది టీం వర్క్కు ఉపయోగపడుతుంది!