Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజూ మనం తీసుకునే ఆహారంలో బ్రేక్ఫాస్ట్ చాలా ముఖ్యమైంది. చాలామంది పొద్దున్నే టీ, కాఫీలతో కడుపు నింపేసి తీరిగ్గా పదిపదకొండు గంటలకు నేరుగా భోజనం చేస్తారు. ఇది మంచి విధానం కాదు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. బ్రేక్ఫాస్ట్ మానేసే జీవనశైలి చాలా అనారోగ్యాలకు కారణం అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు పొద్దున్నే తప్పక ఎక్కువ పోషకాలతో ఉండే బ్రేక్ఫాస్ట్ చేయాలని సూచిస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుంటే చాలా ఆరోగ్యసమస్యలకు చెక్ చెప్పవచ్చు.
పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయకపోతే గుండె సంబంధిత వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా
ఉంటాయి.
అధిక బరువు సమస్యకు కూడా బ్రేక్ఫాస్ట్ చేయకపోవడమే కారణమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల మెదడు యాక్టివ్నెస్ను కోల్పోతుంది. నిరుత్సాహం, చురుకుదనం తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి మానసిక సమస్యలు వస్తాయి.
విద్యార్థులు తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. లేకపోతే క్లాస్లో చెప్పేపాఠాలు అర్థం కావు.
మొలకెత్తిన గింజలు, చిరు ధాన్యాలతో చేసిన ఇడ్లీ, దోశ, రొట్టె, పండ్లు బ్రేక్ఫాస్ట్లో ఉండేలా చూసుకోవాలి.