Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండాకాలంలో ఎక్కువగా వచ్చే పండ్ల జాబితాలో ద్రాక్షను చేర్చవచ్చు. సీజనల్గా వచ్చే వీటిని ఎక్కువగా తినడం వల్ల, జ్యూస్గా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.
ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తిన్నా, జ్యూస్ తాగినా చర్మం సమస్యలు దూరం అవుతాయి. ద్రాక్షలో ఫ్లేవనాయిడ్స్ అధికం. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలు ఆస్తమాను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. వీటిలో ఉండే టీరోస్టిల్బీన్ అనే పదార్థం రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ద్రాక్షపండ్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ మోతాదును పెంచి రక్తం గడ్డలుగా ఏర్పడకుండా నివారిస్తుంది. దీనితో గుండెపోటు వచ్చే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. ద్రాక్షలో ఉన్న యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చర్యలను నివారించడంలో తోడ్పడుతాయి. దాని వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం తగ్గి రక్త సరఫరా పెరుగుతుంది.
రెడ్ గ్రేప్
ఈ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. రెడ్ గ్రేప్ జ్యూస్లో ఎక్కువగా ఉండే ఫ్లేవనాయిడ్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కెరోటినాయిడ్స్ను పాలిఫెనోల్ గా మార్చుటకు ఉపయోగపడే హైపోన్యూట్రియంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెరగడానికి దోహదపడతాయి. రెడ్ గ్రేప్ జ్యూస్లో ఎక్కువ మోతాదులో ఉండే పొటాషియం కడుపు ఉబ్బరం లేకుండా చూస్తుంది. కంటి సంరక్షణకు, మోకాళ్ళ సంరక్షణకు, మెదడు చురుకుదనానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి.
ద్రాక్ష పండ్లను బాగా కడిగి తినాలి. వీటిపైన రసాయన పదార్థాలు కడుపులోకి వెళ్ళడం వలన విరేచనాలు అవుతాయి. కాబట్టి రెండు సార్లు మంచినీళ్ళతో బాగా కడిగి తినాలి. ప