Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవిలో ఎండ తాపానికి ఎంతటి బలవంతులైన అలసిపోతుంటారు. ఇక పసిపిల్లల సంగతైతే చెప్పనక్కర్లేదు. నోరువిప్పి చెప్పుకోలేని పరిస్థితి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. అందుకే తల్లిదండ్రులే వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి...అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందామా?
- వేసవి కాలం పిల్లలు విపరీతంగా ఏడుస్తున్నారంటే వారి శరీర ఉష్ణోగ్రత పెరగడం వలన వచ్చే అలసట, విసుగు అయి ఉండొచ్చని అర్థం చేసుకోవాలి. వారి చుట్టూ చల్లని వాతావరణం ఉండేలా జాగ్రత్తపడాలి. చల్లగాలి తగిలేలా చూడాలి. లేదంటే శరీరం వేడెక్కి విపరీతంగా ఏడ్చేస్తారు.
- ఏసి, కూలర్ల నుంచి వచ్చే చల్లని గాలి తీవ్రత ఎక్కువ గా లేకుండా నార్మల్గా ఉండేలా చూడాలి. కిటికీలకు మెత్తని క్లాత్ తడిపి కడితే మంచిది. ఫ్యాన్ వేయాలను కుంటే తక్కువ స్థాయిలో వేగం ఉండాలి.
- వట్టివేళ్ళ తడికలు తడిపి కిటికీలకు కడితే చల్లని గాలి తగులుతుంది. అలాగే సాధ్యమైనంత వరకు పిల్లల్ని పరుపుల మీద కాకుండా మెత్తటి బట్టల మీదే పడుకో బెట్టుకోవాలి. డైపర్స్ను ఎప్పటి కప్పుడు మారుస్తూ ఉండాలి. డైపర్స్ వాడటం ఇష్టపడని వారు వాటికి బదులుగా కాటన్ దుస్తులు వేస్తే మంచిది. బట్టలను ఎప్పటిక ప్పుడు మారుస్తుం డాలి. పిల్లలకు గోరు వెచ్చని కన్నా ఇంకాస్త చల్లగా ఉన్న నీటిని స్నానానికి ఉపయోగించాలి. శరీరంలోని వేడి తగ్గి జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది.
- పిల్లలకు చెమట పొక్కులు వచ్చిన ప్రదేశంలో అలోవేర అప్లరు చేస్తే మంచిది. పిల్లలకు ఒంటిపై తడి ఆరక ముందే పౌడర్ను ఉపయోగించకూడదు. స్వేదరంధ్రాలు మూసుకుపోయి శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశ ముంది. సాధ్యమైనంత వరకు పౌడర్ రాయకుండా ఉండటానికే ప్రయత్నించండి. చెమట పొక్కులు వచ్చినప్పడు మాత్రం చెమట కాయలకు సంబంధిం చిన పౌడర్ను ఉపయోగించాల్సి వస్తే డాక్టర్ సలహాతో వారి చర్మానికి సరిపడే పౌడర్ను తీసుకోండి.