Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కువ మసాలా, నూనె, కారం వేసి చేసిన కూరలు తింటే ఎంతో రుచిగా ఉంటాయి. నిజమే. కానీ కూరల్లో పోషక విలువలు పోకుండా వండితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా చేసిన కూరలు ఎంతో రుచిగా ఉండడమే కాదు శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తాయి. అలాంటి కూరలను ఎలా వండాలో తెలుసుకుందామా....
- కూరగాయలను తక్కువ నీటితో కొద్దిసేపు మాత్రమే ఉడికించాలి. ఎక్కువ నీళ్లు పోసి కూరలను ఉడకబెడితే వాటిల్లో ఉండే న్యూట్రియంట్లు పోతాయి. . లేదా వాటిని ఆవిరి పట్టాలి. మైక్రోవేవ్లో కూడా పెట్టొచ్చు. ఇలా చేయడం వల్ల కూరగాయల్లోని న్యూట్రియంట్లు వథా అవవు. అందుకే బంగాళాదుంపలాంటివాటిని నీళ్లల్లో ఉడకబెట్టడానికి బదులు ఆవిరిపట్టాలి. బ్రొకోలీ, గ్రీన్ బీన్స్ వంటి వాటిని కూడా ఉడకబెట్టే బదులు మెత్తగా అయ్యే వరకూ ఆవిరిపట్టడం లేదా మైక్రోవేవ్లో పెట్టడం మంచిది.
- అలాగే కూరగాయలు తేమగా ఉండడానికి వాటిని ఐస్ నీళ్లల్లో ముంచొద్దు. వేడినీళ్లల్లాగే చల్లటి నీళ్లు కూడా కూరగాయల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు పోయేలా చేస్తాయి. అందుకే కూరగాయలను ఒక నిమిషం కన్నా తక్కువ సేపు ఉడికించి వాటిని బేకింగ్ షీట్ మీద పరవాలి. ఇలా చేయడం వల్ల రూమ్ టెంపరేచర్కు తగ్గట్టు అవి తొందరగా చల్లబడతాయి.
- ఆవిరిపట్టిన ప్లెయిన్ కూరలు తింటే న్యూట్రిషన్ పరంగా ఎంతో మంచిది. కానీ ఉడకబెట్టిన కాయగూరల్లో కొద్దిగా ఫ్యాట్ కూడా ఉంటే మంచిది. ఉదాహరణకు బీటా కెరోటిన్, విటమిన్-డి, విటమిన్-కె లు ఫ్యాట్ సొల్యుబుల్స్. ఇవి చిన్న పేగు ద్వారా రక్తంలో కలిసి కొంత ఫ్యాట్ను శరీరానికి అందిస్తాయి. అందుకే ఉడకబెట్టిన కూరగాయలను కాస్త వేగించడం, ఆ కూరకు వినైగ్రెట్టె వంటి ఫ్లేవర్స్ చేర్చడం వల్ల కొంత ఫ్యాట్ కూడా శరీరానికి అందుతుంది. తినడానికి రుచిగా కూడా ఉంటాయి.
- పాలకూర, బ్రొకోలీ వంటి కూరగాయల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అయితే దాన్ని శరీరం నేరుగా వినియోగించుకోలేదు. ఫలితంగా అది జీర్ణం కాకుండా వథాగా బయటకు పోతుంది. అందుకు 'సి' విటమిన్ ఉండే పండ్లను చేర్చాలి. సిట్రస్ పండ్లల్లో ఉండే సి-విటమిన్ ఐరన్తో సంయోగం చెందినపుడు రసాయనిక మార్పులు సంభవిస్తాయి. అప్పుడు ఐరన్ని శరీరం సులభంగా గ్రహించగలుగుతుంది. ఉడకబెట్టి కాస్త వేగించిన కూరపై నిమ్మకాయ రసం లేదా కమలాపండు లేదా ద్రాక్షపండు రసం కొద్దిగా చిలకరించి తింటే శరీరానికి అందాల్సిన విటమిన్లు, పోషకాలు, ఐరన్ అన్నీ అందుతాయి.
- కూరగాయలను తరగకముందే నీళ్లల్లో బాగా కడగాలి. తరిగిన తర్వాత నీళ్లల్లో కడగడం వల్ల వాటిల్లోని న్యూట్రియంట్లు పోతాయి. కొన్ని కూరగాయలపైనున్న తొక్కను తీసేస్తుంటాం. ఆ తొక్క కింద భాగంలో న్యూట్రియంట్లు ఉంటాయి. అందుకని సాధ్యమైనంతవరకూ కూరగాయల తొక్క తీయకుండా వండడానికి ప్రయత్నించండి.
- చాలామంది కూరగాయలు తరిగిన తర్వాత ఎప్పుడో వండుతుంటారు. కానీ అలా చేయడం వల్ల తరిగిన కూరగాయ ముక్కలపై వెలుగు పడి, గాలి తగిలి వాటిల్లో ఉండే న్యూట్రియంట్లు పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. అందుకే తరిగిన వెంటనే వండితే వాటిల్లోని విటమిన్లు, ఖనిజాలు శరీరానికి సరిగా అందుతాయి.