Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసలే నడి వేసవి. ఎండలు ఎక్కువగా ఉన్నట్లే కూరగాయల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. మార్కెట్కు వందలకు వందల డబ్బులు తీసుకెళ్లినా వారానికి సరిపడా రావట్లేదు. అందుకే ఈ చిట్కాలు పాటించి చూడండి.
- టమాటాలు అధిక ధరలు పలుకుతున్నప్పుడు పప్పులాంటి వంటకాల్లో వాటికి బదులుగా ఏ చింతపండో, మామిడికాయో, చింతచిగురో వేస్తే వంట రుచికరంగా ఉంటుంది.
- కరివేపాకు పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలామంది పెరట్లో కరివేపాకు చెట్టుంటుంది. కాస్త చింతపండు, వెల్లుల్లి, కారప్పొడి లేదా ఎండు మిర పకాయలు, జీలకర్ర వేసి పచ్చడి చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
- పచ్చిపులుసు, మిరియాల చారు చేసే సమయంలో ఖరీదైన పచ్చిమిర్చికి బదులుగా ఇంట్లో నిలవ వుంచుకున్న ఎండుమిరపకాయలు ఉపయోగించు కోవచ్చు. మాంసాహారులు ఉల్లిపాయలు, అల్లం ఉపయోగించకుండానే మటన్ లేదా చికెన్ను రుచికరంగా వండుకోవచ్చు. మొదట కుక్కర్లో మటన్ లేదా చికెన్తో పాటు కాస్త పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. నీళ్లు ఇగిరిపోయాక కావాల్సిన మేరకు మిరియాలు, వెల్లుల్లి అందులో వెయ్యాలి. కారం కోసం నాలుగైదు ఎండుమిరపకాయలు సరిపోతాయి. కొత్తిమీర సన్నగా తరిగివేసినా బాగుంటుంది. ఇష్టపడే రుచికి తగ్గట్టు వండుకోవచ్చు.
- పలావ్ చెయ్యాలన్నా ఓ నాలుగు యాలక్కాయలు, నూనె లేదా నెయ్యిలో నలగ్గొట్టి వేసి వేయించిన తరువాత ఎసరు పెట్టి వండుకోవచ్చు. రంగు రావాలంటే ఏ జిలేబీ కలరో, పసుపో వేసుకుంటే బాగుంటుంది.
- 'ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు'-అని విచారించే బదులు, మనకు అందుబాటులో ఉన్న వాటితో పొదుపు పాటించేలా ఆహార పదార్థాలు వండుకునే వీలుంది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి నేడు అధిక ధరలు పెట్టి ఏది కొనాలన్నా బాధగానే ఉంటుంది. తగిన ప్రత్యామ్నా య పద్ధతులను అనుసరించి, మనసు పెట్టి వండితే అందరికీ తప్తిగా ఉంటుంది. పొదుపు మంత్రం పాటించి ప్రతి గహిణి ఆర్థిక సమస్యల నుంచి సులువుగా గట్టెక్కవచ్చు.