Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెలసరి వస్తోందంటే చాలు.. కొందరిలో పొట్ట నొప్పీ, అలసట, తలనొప్పి, వికారం, అతి కోపం, ఆకలి పెరగడం లాంటివి ఎదురవుతాయి. ఈ సమస్యల్ని అధిగమించాలంటే
- ఆ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. తాజా పండ్లరసాలూ, బి, ఇ విటమిన్లు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. దానివల్ల పొట్టనొప్పి, ఉబ్బరం, అసౌకర్యం లాంటి సమస్యలు చాలా మటుకు తగ్గుతాయి.పండ్లూ, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పీచూ, విటమిన్లూ అందుతాయి. పండ్లు సహజ చక్కెరలను అందిస్తాయి. శరీరం కూడా శక్తిమంతంగా మారుతుంది. ఈ సమయంలో కమలాఫలాలు, స్ట్రాబెర్రీలూ, పుచ్చకాయల్లాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే విటమిన్ 'సి' అందుతుంది.
- కొవ్వూ, చక్కెరా, ఉప్పు, ఎక్కువగా ఉండే పదార్థాలు ఈ సమయంలో తీసుకోవడం మానేయాలి. దానివల్ల పొట్టనొప్పీ, అలసిపోయినట్లు ఉండటం, ఒత్తిడీ, వికారం కలగవు. బదులుగా చిన్న చాక్లెట్ ముక్కను తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. ఒత్తిడి తగ్గి మానసిక సాంత్వన లభిస్తుంది.
- శరీరానికి తాజా ప్రాణవాయువు అందడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శరీరానికి పోషకాలూ సమృద్ధిగా అందుతాయి. కండరాల నొప్పుల్లాంటివీ తగ్గుతాయి. ఈ ఫలితాలు అందాలంటే ప్రతిరోజూ కనీసం అరగంటసేపు నడవడం అలవాటు చేసుకోవాలి.