Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కొన్ని సూత్రాలు పాటించాల్సిందే. అందుకు భోజనం చేశాక కొన్నిటిని తినకుండా ఉంటే బరువు పెరగడం, పొట్టపెరగడం... ఇలాంటి వాటికి చెక్పెట్టొచ్చు
భోజనం చేసే ముందు లేదా తర్వాత పండ్లు ఎక్కువగా తినకూడదు.
అన్నం తిన్న వెంటనే టీ తాగకూడదు. అలా చేస్తే తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి.
తినగానే స్నానం చేయకూడదు. దానివల్ల కాళ్లు, చేతుల్లోకి రక్తప్రసరణ పెరుగుతుంది. అందువల్ల పొట్ట చుట్టూ రక్త ప్రసరణ తగ్గి, జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది.
భోజనం అయ్యాక పదినిమిషాల పాటు నడిస్తే మంచిది అంటారు. కానీ అలా నడవడం వల్ల పోషకాలను గ్రహించడంలో జీర్ణవ్యవస్థ విఫలమవుతుంది. తిన్నవెంటనే కాకుండా ఓ పదినిమిషాల తర్వాత నడిస్తే మంచిది.
అన్నింటికంటే ముఖ్యంగా తినగానే నిద్రపోకూడదు. అలా నిద్రపోతే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి.