Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరితా రారు. బీహార్కు చెందిన యువతి తండ్రి ఉద్యోగరీత్యా ఈశాన్య రాష్ట్రాల్లో పెరిగింది. కానీ సెలవుల్లో స్వస్థలమైన హాజీపూర్కు వస్తూ పోతూ ఉండేది. అలా ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఓసారి హాజీపూర్ వచ్చింది తల్లిదండ్రులతో. అదే సమయంలో సైకిల్ దొంగతనం చేశాడనే పేరుతో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొడుతున్నారు. అతను దొంగతనం చేయలేదని మొత్తుకుంటున్నా ఎవ్వరూ వినే పరిస్థితిలో లేరు. అతను నిజమే చెబుతున్నాడని సరిత నమ్మకం. కానీ పదేళ్ల పిల్ల చెబితే వినేవాళ్లెవ్వరక్కడీ అందుకే ఏం చేయాలో తోచక... తనకు కనిపించిన ఓ తాడు తీసుకుని మెడకు చుట్టుకుంది. ఆ వ్యక్తిని వదిలేయకపోతే.. తాను ఆ తాడు బిగించుకుని చనిపోతానని బెదిరించింది. దాంతో భయపడ్డవాళ్లు... ఆ వ్యక్తిని వదిలేశారు. అప్పుడు అతని ముఖంలోని కృతజ్ఞత ఆమెను జీవితాంతం వెంటాడుతూనే ఉన్నది. అలా పేదరికం కారణంగా... చేయని తప్పులకు బలవుతున్నవారెందరో. అందుకే పెద్దయ్యాక లా చదివింది. జువైనల్ జస్టిస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసింది. అసలు ఆ పేదరికమే పోవాలంటే.. చదువు ముఖ్యం అని పెద్దయ్యేకొద్దీ తెలుసుకున్నది.
తండ్రి అటవీ అధికారిగా పనిచేసి రిటైర్ అయిన తరువాత సరిత.. బీహార్కు షిఫ్టయ్యింది. అబ్బాయిలయితే బాలకార్మికులుగా మగ్గిపోతారు. అమ్మాయిలయితే మైనర్లకే పెళ్లిళ్లవుతున్నాయి. అక్కడి పిల్లల పరిస్థితి చూసి ఆమె కడుపు తరుక్కుపోయింది. వాళ్లకోసం ఏదైనా చేయాలనుకుంది. ఆ ఆలోచనల ఫలితమే.. ఉడాన్ స్టడీ పాయింట్. బాగా సంపాదించే భర్త. విలాసవంతమైన జీవితం. అన్నింటినీ ఇలా తన్నేసి.. బీహార్లోని పేద పిల్లలకోసం పనిచేస్తున్నది. మొదట చదువు అవశ్యకత గురించి చెప్పడం మొదలుపెట్టింది. మురికివాడల్లోని ఇంటింటికీ వెళ్లింది. పిల్లలను చదివించండని తల్లిదండ్రులను ఒప్పించింది. తరువాత పిల్లల కోసం పాఠశాలను ఏర్పాటు చేసింది. వేల సంఖ్యలో విద్యార్థులను చేరదీసి ఉచిత విద్యను అందిస్తున్నది. లాయర్ వ త్తిని వదిలేసి మురికివాడల్లో ఉండే పిల్లల భవిష్యత్, బాగోగుల మీద ఆమె ద ష్టి పెట్టింది. ఒక్క హాజీపూరే కాదు.. చుట్టుపక్కలలోని పలు మురికివాడల్లో నివసించే చిన్నపిల్లలను చేరదీసింది. వారిని ఫ్యాక్టరీలకు, రెస్టారెంట్లకు, మెకానిక్ షెడ్లకు వెళ్లనీయకుండా చదువు వైపు మళ్లించింది.
అలా నెమ్మదిగా ఆయా ప్రాంతాల్లో ఉండే నిరుపేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకుల్ని చేస్తున్నది. ఒక్కో బ్యాచ్కు 100మంది పిల్లలుంటారు. నలుగురు వలంటీర్లతో సరితరారు ఇప్పటి వరకూ 2,000 మంది పిల్లలను టాపర్ స్టడీ పాయింట్ ద్వారా తీర్చి దిద్దింది. ఆరో తరగతి వరకు తన స్కూల్లో చదువు చెప్పి... ఆ తరువాత విద్యాహక్కు చట్టం కింద ఇతర హై స్కూళ్లలో పిల్లలను చేరుస్తుంది. అలా ఆమె చదువు చెప్పిన ఓ విద్యార్థి ఇటీవలే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించుకున్నది. నిజానికి బాల్య వివాహానికి బలికాబోయింది. ఆసమయంలో ఆమెకు అండగా కనిపించింది సరితా. సరిత దగ్గరకు విషయమంతా వివరించింది. వెంటనే వెళ్లి మైనారిటీ తీరకముందే అమ్మాయికి పెళ్లి చేయడం తప్పని తల్లిండ్రులకు వివరించి, పెండ్లిని ఆపేసింది. తరువాత తన దగ్గరే ఉంచుకుని చదివించి ప్రయోజకురాలిని చేసింది. ఈ ఎనిమిదేండ్ల సేవా ప్రయాణంలో ఇలా తల్లిదండ్రులను ఒప్పించడం, చదువు పట్ల పిల్లలకు ఆసక్తి కలిగించడం కోసం ఆమె కష్టాలెన్నో. తన దగ్గర చదువుకున్న పిల్లలు ఇట్లా ప్రయోజకులవుతున్నప్పుడు, పడ్డ కష్టమంతా పోయి.. ఆనందంగా ఉంటుందని చెబుతున్నది సరిత.