Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందు వెచ్చని నీటితో తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. దీనివల్ల స్వేదగ్రంథుల జిడ్డు, తద్వారా మురికి తొలగి చర్మకాంతి తగ్గకుండా ఉంటుంది.
- దూది ఉండతో క్లెన్సింగ్ మిల్క్ను ముఖమంతా రాసి తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి. రెండురోజులకు ఒకసారి ఈవిధంగా చేస్తే స్వేదగ్రంథులు చక్కగా శుభ్రపడతాయి. ముఖచర్మం జిడ్డుగా మారదు.
- జిడ్డు తొలగిపోవాలని స్క్రబ్తో ముఖాన్ని ఎక్కువగా రుద్దకూడదు. వారానికి 2 సార్లు స్క్రబ్ చేస్తే మృతకణాలు, బ్లాక్హెడ్స్ తగ్గుతాయి. నూనెలు, ఇతర మాయిశ్చరైజర్ క్రీమ్లను ఈ కాలం ఉపయోగించ కపోవడమే మేలు.
- ముల్తానా మట్టి లేదా గంధం పొడి వారానికి ఒకసారి ప్యాక్లా వేసుకొని ఆరాక శుభ్రపరచుకోవాలి. దీంతో అదనపు జిడ్డు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది.
- ప్రతిరోజూ ముఖాన్ని శుభ్రపరచుకోవడానికి ముందు టిష్యూ ప్యాడ్తో తుడవాలి. ఇలా చేయడం వల్ల అదనపు జిడ్డు సులువుగా వదిలిపోతుంది. నేరుగా చెయ్యి ముఖానికి తగలడం వల్ల మొటిమలు, యాక్నె సమస్య పెరుగుతుంది.
- ఈ కాలం వేపుళ్లు, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల జిడ్డు సమస్య పెరుగుతుంది. విటమిన్ 'ఎ' అధికంగా ఉండే క్యారట్, ఆకుకూరలు, తాజా పండ్లు తినాలి.
- రోజూ 2-4 లీటర్ల నీళ్లు తప్పక తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే జిడ్డు సమస్య బాధించదు.