Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలంటే వంటింట్లో దొరికే వస్తువులతో ఆరోగ్యవంతమైన ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు.
అరటిపండు, పెరుగు ప్యాక్..
కావాల్సిన వస్తువులు: బాగా మగ్గిన అరటిపండు ఒకటి, పెరుగు ఒక టేబుల్స్పూను, తేనె ఒక టీస్పూను, నిమ్మరసం ఒక టీస్పూన్
ఫేస్ప్యాక్ తయారీ: చిన్న గిన్నె తీసుకుని అందులో అరిటిపండు గుజ్జును, పెరుగును వేసి బాగా కలపాలి. దానికి తేనె, నిమ్మరసం కూడా చేర్చి చిక్కటి పేస్టులా తయారుచేయాలి. ఈ ప్యాక్ను ముఖం మీద, మెడభాగంలో రాసుకోవాలి. ప్యాక్ ఎండిపోయే వరకూ ఉంచుకుని చల్లటి నీళ్లతో కడు క్కోవాలి. నిమ్మ సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్. దీనివల్ల చర్మం శుభ్రంగా ఉండడంతో పాటు కాంతివంతంగా ఉంటుంది. అరటి పండు గుజ్జును రాసుకోవడం వల్ల కూడా చర్మం మెరుస్తుంది.
వేప, శెనగపిండి, పెరుగుతో ప్యాక్...
కావాల్సినవస్తువులు: వేపాకులు లేదా వేప పొడి, ఒక టేబుల్స్పూన్ శెనగపిండి, ఒక టీస్పూన్ పెరుగు.
ఫేస్ ప్యాక్ తయారీ: ఒక టీస్పూను పెరుగును చిన్న గిన్నెలో పోయాలి. అందులో శెనగపిండి కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. తర్వాత బాగా నూరిన వేపాకులు లేదా వేప పొడిని ఆ పేస్టులో కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10-15 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇందులో పెరుగు వాడడం వల్ల చర్మం మదువుగా ఉంటుంది. ఈ ప్యాక్లో వేపపొడి లేదా వేపాకులను ఉపయోగించడం వల్ల ముఖానికి యాంటిసెప్టిక్లా పనిచేస్తుంది.