Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిడ్డకు తల్లినవుతున్నానని తెలిసినపుడు ప్రతి స్త్రీ ఎంతో ఆనందిస్తుంది. కానీ ఆ నవ మాసాలూ ఆరోగ్యవిషయంలో మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
- స్త్రీలు గర్భం ధరించినపుడు కడుపులో పెరుగుతున్న శిశువుకి ఆహారం ఎక్కువగా అందాలి. ఇందుకోసం గర్భిణీలకు అదనపు శక్తి కావాలి. ఎక్కువ కాలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. రోజుకు ఎన్ని కాలరీలు తీసుకోవాలనేది వాళ్ల శరీర బరువు, చేస్తున్న వ్యాయామాలు, తినే ఆహారాన్ని బట్టి ఉంటుంది.
- కడుపులో ఉన్న పిండం పెరుగుదలకు తల్లికి అదనపు శక్తి అవసరమవుతుంది. ఇందుకోసం గర్భిణులు కాల్షియం బాగా తీసుకోవాలి. ఐరన్ కూడా వీళ్లకి చాలా అవసరం. ఐరన్ కడుపులో పెరుగుతున్న శిశువుకి ఆక్సిజన్ అందేట్లు చేస్తుంది.
- ఫోలిక్ యాసిడ్ కూడా గర్భవతులకు చాలా అవసరం. పేద, సంపన్న వర్గాలన్న తేడా లేకుండా గర్భిణీలందరూ తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్, ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. గర్భిణీలలో ఎక్కువమంది మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతుంటారు. అలాంటి సందర్భాలలో ఉదయం డ్రైఫ్రూట్స్ తింటే మంచిది. బిస్కట్లు, ఇడ్లీ కూడా తినొచ్చు. నూనె పదార్థాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఇవి తొందరగా అరగవు.
- పచ్చికూరగాయలు, సగం ఉడికిన పదార్థాలు కూడా తినకూడదు. అలర్జీకి దారితీసే వేరుశెనగపప్పు లాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు తినడం వల్ల ఆహారం అరగక జీర్ణశక్తి దెబ్బతింటుంది. గుండె ల్లో మంటలా అనిపిస్తుంది. ఆకలివేస్తోందని ఒకేసారి ఎక్కువ ఆహారం తినకుండా రోజులో కొద్ది కొద్దిగా ఎక్కువ మార్లు తింటే మంచిది.