Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాగిణి... శేఖర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆరు నెలలు కూడా కాకముందే వారి మధ్య గొడవలు. పెళ్లికి ముందు తనతో సరదాగా గడిపిన శేఖర్ పెళ్లి తరువాత పట్టించుకోవడం లేదని, ప్రేమగా చూసుకోవడం లేదని రాగిణి బాధ. ఉద్యోగం, ఇంటి బాధ్యతలు అని శేఖర్ వాదన. ఇలా గొడవలు ప్రతిరోజూ పెరిగిపోతూనే ఉన్నాయి. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉందనే చెప్పాలి.
- ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలసి వుండటానికి ప్రేమ ఎంతో ముఖ్యమని అందరికీ తెలిసిందే. ఏరికోరి పెళ్ళిని ప్రేమతో ముడివేసుకున్న వాళ్ళు కూడా ఒకోసారి పెళ్ళి తర్వాత ఆ ప్రేమ కోసం వెతుకులాడటం చూస్తుంటాం... ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలసి బతకడంలో ఎక్కడో ఆ ప్రేమని జారవిడుచుకుంటారు. అందుకు కారణం నువ్వంటే నువ్వని వాదించుకుంటారు. మార్పు ఎదుటి వ్యక్తిలో రావాలని ప్రగాఢంగా నమ్ముతారు. ఖాళీ మనసులతో, నిర్జీవంగా మారిన బంధంతో, సర్దుకోలేక అసంతప్తితో నలిగిపోతుంటారు.
- భార్యాభర్తల మధ్య 'ప్రేమ' ఎప్పటికీ తాజాగా నిలవాలంటే.. మనసుకు కష్టం కలిగించిన విషయం ఏదైనా ఉంటే వెంటనే ఆ విషయాన్ని భాగస్వామితో చర్చించాలి. నెమ్మదిగా చెప్పాలి. అలా కాకుండా ఆ బాధను దిగమింగితే అది మనసులోనే పెరిగి, పెద్దదై గొడవలకు కారణమవుతుంది. అలా అని ప్రతీ నిమిషం నాకిది నచ్చలేదు, నువ్వు ఇలా చేశావు అంటూ ఆరోపణలు గుప్పించటం కాదు. బాధ కలిగింది అన్న విషయాన్ని కమ్యునికేట్ చేయటమే
లక్ష్యం తప్ప ఎదుటి వ్యక్తి పొరపాట్లని ఎంచటం ఉద్దేశం కాకూడదు.
ఙ అలాగే... ఏం చెబితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారోనని ఊహించుకుని భయపడటం కూడా మంచిది కాదు. ఇతరుల మెదడులోకి చూడటం మాని మనం ఏం అనుకుంటున్నామో అవి చెప్పాలి. ఎందుకంటే అపోహతో ఎదుటి వ్యక్తిని దూరం చేసుకునే బదులు బాధను పంచుకుని దగ్గర చేసుకోవటం వివేకమనిపించుకుంటుంది.
- తెలిసీ తెలియక ఏ చిన్న పొరపాటు చేసినా, మాట తూలినా, ఎదుటి వ్యక్తి మనసు కష్టపెట్టినా ఆ పొరపాటుని అంగీకరించాలి. జరిగిన పొరపాటుని సరిదిద్దే బాధ్యత కూడా తీసుకోవాలి. అప్పుడే ఎదుటి వ్యక్తి విశ్వాసాన్ని పొందగలం. అలాగే మన ఆత్మవిశ్వాసం నిలుపుకోగలం. పొరపాటు అంగీకరించినట్లు ఎదుటివారు గుర్తించినప్పుడు మాత్రమే వారూ ఓ అడుగు ముందుకు వేసి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు.
- ఒక్కోసారిచాలా సరదాగా మొదలైన చర్చ తీవ్రరూపంగా మారుతుంది. అలాంటప్పుడు ఆ చర్చను అక్కడితో ఆపేయడం మంచింది. ఎవరికి వారు వేరే పనిలో కాసేపు దష్టిపెట్టి, ఆవేశం చల్లారాక మాట్లాడటానికి ప్రయత్నించాలి. అందుకు కొంత సమయం పట్టినా పర్వాలేదు. తొందరపాటుతో బంధాన్ని బలహీనపరచుకోవటం కన్నా ఓపికపట్టడం తప్పుకాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకు తీరాలి. ఏ సమస్యకి అయినా సరైన వాతావరణంలో ప్రశాంతంగా చర్చించడం ద్వారానే పరిష్కారం దొరుకుతుంది.
- ఇక ఎప్పుడైనా సమస్యలు వచ్చినపుడు ఎదుటి వ్యక్తి చెప్పేది వినటమూ ముఖ్యమే. వినటమంటే చెవులతో కాదు... మనసుతో వినటం ముఖ్యం. తను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే రెండో ఆలోచన లేకుండా ఒప్పుకోగలగాలి. అయితే... కానీ లాంటి కారణాలు వెతకద్దు. అలాగే తన ఆలోచన తప్పనిపిస్తే దానిని కూడా స్పష్టంగా, నెమ్మదిగా చెప్పాలి.
- ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏ విషయంలో అయినా మనసుకి పని చెప్పాలి కానీ, మెదడుకి కాదు. అన్నిటికంటే ముఖ్యం భార్యాభర్తల మధ్య నిశ్శబ్దానికి చోటుండకూడదు.