Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కప్పు మామిడిపండు గుజ్జు, కప్పు పెరుగు, అరకప్పు ఓట్స్, మూడు టీస్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు స్క్రబ్గా ఉపయోగించాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పాదాల చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.
- చేతులు, పాదాలపై ట్యాన్ పోవాలంటే మామిడిపండు గుజ్జులో, టీస్పూన్ తేనె కలిపి ఐదునిమిషాలు మసాజ్ చేయాలి. మరో ఐదు నిమిషాల తర్వాత శుభ్రపరచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
- టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్, కప్పుడు వైట్ వెనిగర్, గోరువెచ్చని నీళ్లలో కలపాలి. ఆ నీటిలో పాదాలను పదిహేను నిమిషాలు ఉంచాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈవిధంగా చేస్తుంటే కాలిపగుళ్లు తగ్గుతాయి. పాదాల చర్మం మృదువుగా అవుతుంది.
- నీళ్లలో నానితే వేళ్ల మధ్య తడివల్ల ఫంగస్చేరుతుంటుంది. ఇలాంటప్పుడు బేకింగ్ పౌడర్లో మూడు చుక్కుల ఎసెన్షియల్ ఆయిల్ని కలిపి పాదాలకు, వేళ్ల మధ్య రాసుకోవాలి. దీనివల్ల ఫంగస్ తగ్గడంతో పాటు, చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
- కాళ్లు, పాదాల చర్మం పొడిబారి పొలుసులుగా కనిపిస్తుంటుంది. సీసాల్ట్లో కొద్దిగా పాలు కలిపి చర్మంపై రాసి మృదువుగా స్క్రబ్ చేయాలి. ఇది శక్తివంతమైన క్లెన్సర్గా ఉపయోగపడుతుంది. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది.
- రాత్రి పడుకునే ముందుగా పాదాలను శుభ్రపరచాలి. తర్వాత కరిగించిన వ్యాక్స్లో కొద్దిగా ఆవనూనె కలిపి రాసుకోవాలి. పది-పదిహేను రోజుల్లో కాలిపగుళ్లు తగ్గుతాయి. పాదాల చర్మం మృదువుగా మారుతుంది.
- ఉప్పులేని బటర్ టేబుల్ స్పూన్, స్ట్రాబెర్రీ ఒకటి. చిన్న ముక్క కీరా, టీస్పూన్ నిమ్మరసం, గుడ్డులోని పచ్చసొన కలిపి పేస్ట్ చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. పాదాల చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.