Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమలా పండు:కమలా పండు రసం, గుజ్జు, తొక్క వీటిలో దేనితోనైనా సౌందర్యానికి సంబందించి అద్భుతాలు చేసేయొచ్చు. కమలా పండులో ఉండే సి-విటమిన్ చర్మాన్ని పునరుత్తేజం చేసి మెరుపునిస్తుంది. 1.4 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ రసాన్ని ఒక టేబుల్ స్పూన్ పెరుగులో కలిపి ముఖానికి మాస్క్ వేసుకోవాలి. ఆరాక కడిగేయాలి. అలాగే కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి మెత్తగా పొడి కొట్టి పెరుగుతో కలిపి స్క్రబర్లా వాడొచ్చు.
కుంకుమపువ్వు: కుంకుమపువ్వులో కాపర్, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, సెలీనియం, జింక్, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ ముఖంపై మచ్చలు లేకుండా చేస్తాయి. ఒక టీస్పూన్ గంధం, రెండు లేదా మూడు కుంకుమపువ్వు తీగలు తీసుకుని రెండు టీ స్పూన్ల పాలలో కలపాలి. ఈ ప్యాక్ను ముఖానికి మాస్క్లా వేసి ఆరాక చన్నీళ్లతో కడగాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం.
జిన్సెంగ్ టీబ్యాగ్: చర్మంలో కొల్లాజెన్ వద్ధిచెందేందుకు జిన్సెంగ్ చాలా బాగా పనిచేస్తుంది. దానివల్ల చర్మం సాగడం అనేది ఉండదు. అంతేకాకుండా చర్మాన్ని తేమతో ఉంచి... నల్ల మచ్చలను కూడా తగ్గిస్తుంది. దీన్నెలా వాడాలంటే... జిన్సెన్ టీ బ్యాగ్లు లభిస్తాయి. వాటి పౌడర్లో గుడ్డు పచ్చసొన కలిపి ముఖానికి మాస్క్లా వేసుకుని ఆరాక కడిగేసుకోవాలి.
వీట్జెర్మ్ ఆయిల్: ఈ నూనె ఫార్మసి షాపుల్లో లభిస్తుంది. ఇందులో ఎ, డి, బి విటమిన్లతో పాటు యాంటాక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి వద్ధ్యాపు ఛాయలు చర్మం మీద పడకుండా ఆలస్యం చేస్తాయి. చర్మం మదువుగా, మెరిసేలా చేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల వీట్ గ్రాం ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. ఆరాక కడిగేస్తే చర్మానికి ఇన్స్టంట్ బూస్టర్ని అందించినట్టే.