Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొంతమంది పిల్లలు ఎంతకీ తినరు. మరి కొంద రేమో ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. దీంతో తల్లి దండ్రులు హైరానా పడుతుం టారు. పోషకాహారం అందకపోవడం వల్ల ఎదుగుదల లోపిస్తుంది. వయసుకు తగ్గ బరువూ పెరగరూ.
పిల్లలు బక్కపల్చగా ఉన్నారని.. అదే పనిగా తినిపిం చడం సరికాదు. దీనివల్ల క్రమం గా వారిలో ఆకలి తగ్గుతుంది. చాక్లెట్లు, ప్రొటీన్ షేక్స్, బిస్కెట్లు ఎక్కువగా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూడండి.
- కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పుధాన్యాలు పిల్లల డైట్లో ఉండేలా చూసు కోవాలి. ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరిగా పాటించాలి. మూడుపూటలు కాకుండా కొంచెం కొంచెంగా అయినా ఐదుపూటలు తినేలా చూడాలి.
- పిల్లలు తీసుకునే ఆహారంలో షుగర్ను ఎక్కువగా వాడకూడదు. హెల్త్డ్రింక్స్లో అదనంగా పంచదార కల పాల్సిన అవసరం లేదు. అన్నంతో పాటు గోధుమలతో చేసే పదార్థాలు బలాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి.
- రాగులు, తైదలు వంటి తణ ధాన్యాలను డైట్లో భాగంగా చేయండి. కాజు, బాదాం, ఎండుద్రాక్ష తినడం వల్ల పిల్లలు బరువు పెరుగుతారు.
- నూడుల్స్, పిజ్జా, బర్గర్ల వంటి జంక్ఫుడ్ను అతిగా తినిపించొద్దు. పిల్లల సంతోషం కొద్ది నెలకు ఒకట్రెండుసార్లు తినిపిస్తే సరి పోతుంది. అంతే కానీ, వారానికి రెండుసార్లు జంక్ఫుడ్స్తో వారిని ఎంగేజ్ చేస్తే ఇబ్బందే.
- ఆటలు బాగా ఆడినపుడే పిల్లల్లో జీర్ణశక్తి పెరుగుతుంది. ఉదయం, సాయంత్రం ఓ గంటపాటు ఆటలకు సమయం కేటాయించండి. ఆకలి బాగా ఉన్నప్పుడు వాళ్లు తినడానికి ఇష్టపడతారు. ఓ ముద్ద ఎక్కువగా తింటారు.