Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖం జిడ్డుగా కనిపిస్తే బాగుండదు. ఈ సమస్య కొందరిని ఎక్కువగా ఇబ్బందిపెడుతుంది. దీనివల్ల మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటి సమస్యలు కూడా వేధిస్తుంటాయి.
అయితే ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఈ టిప్స్ను పాటిస్తే మీ చర్మం మిల మిలా మెరుస్తుంది.
టొమాటో జ్యూస్: ముఖం మీదున్న జిడ్డుతనాన్ని పోగొట్టడంలో టొమాటో జ్యూస్ బాగా పనిచేస్తుంది. ఇది చర్మం లోని సూక్ష్మరంధ్రాలను శుభ్రంచే యడమే కాకుండా అవి ముడుచుకుపోయేలా చేస్తుంది. అందుకే టొమాటో జ్యూసు లేదా టొమాటో గుజ్జును ముఖం మీద రాసుకోవాలి. టొమాటోకు కీర, తెల్లసొనలను కూడా చేర్చి ఆ మిశ్రమాన్ని సైతం ముఖానికి రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం బాగా శుభ్రమవుతుంది.
తెల్లసొన: తెల్లసొనలో ఎంజైములు బాగా ఉంటాయి. చర్మంలోని నూనెకారే గుణాన్ని అవి బాగా తగ్గిస్తాయి. చర్మాన్ని శుభ్రం చేయడంతోపాటు, టోనింగ్ చేస్తాయి. చర్మం సాగే గుణాన్ని నిరోధిస్తాయి. దీనికి మనం చేయాల్సిందల్లా తెల్లసొనను బాగా గిలకొట్టి పెదాలకి తప్ప ముఖానికంతటికీ రాసుకోవాలి. అది బాగా ఎండిపోయిన తర్వాత నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
ముల్తాని మట్టి: చర్మంలో ఉన్న అదనపు ఆయిల్ని పూర్తిగా పీల్చేసే గుణం ముల్తాని మట్టికి ఉంది. అంతేకాదు చర్మం యొక్క సూక్ష్మరంధ్రాలు సాగకుండా చేస్తుంది. ముఖంపై చర్మాన్ని బాగా కీ ్లన్ చేస్తుంది. నల్లమచ్చలను, గీతలను కూడా పోగొడుతుంది. సూర్యకిరణాలు సోకడం వల్ల దెబ్బతిన్న చర్మాన్ని సైతం ఇది పరిరక్షిస్తుంది. దీన్ని అప్లై చేయడం చాలా సింపుల్. ముల్తానీమట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్టులా తయారుచేసి దాన్ని కళ ్ల చుట్టూరా, పెదాల దగ్గర తప్ప మిగతా ముఖానికి రాసుకొని అది ఎండిపోయే వరకూ అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.
ఓట్మీల్: పాడైన చర్మాన్ని తొలగించడంలో ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. ఫలితంగా చర్మంలో ఉండే అదనపు జిడ్డుతనం పోవడంతోపాటు చర్మం మదువుగా తయారవుతుంది. స్కిన్ సెన్సిటివ్గా ఉండడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఓట్మీల్కు తెల్లసొనను జోడించి ఆ మిశ్రమాన్ని పేస్టులా తయారుచేయాలి. ఆ పేస్టును చర్మ రంధ్రాలు తెరుచుకున్నచోట అప్లై చేయాలి. ముఖానికి రాసుకున్న పేస్టు ఎండిపోయిన తర్వాత కొద్దిగా నీరు పోసి మెల్లగా చర్మం పైభాగాన కాసేపు మదువుగా రుద్దాలి. తర్వాత నీటితో ముఖాన్ని బాగా కడుక్కోవాలి.
పెరుగు: పెరుగులో లాక్టిక్ యాసిడ్ బాగా ఉంటుంది. ఇది ఎల్లవేళలా చర్మ సమతుల్య స్థితిని కాపాడుతుంది. మతకణాలను తొలగిస్తుంది. చర్మం రంధ్రాలపై కూడా బాగా పనిచేస్తుంది. స్కిన్ని ఎంతో మదువుగా ఉంచుతుంది. పెరుగులో బాగా మెత్తగా రుబ్బిన బాదంపప్పులను, ఎండిన కమలాపండు తొక్కల పొడిని, నిమ్మకాయతొక్కల పొడిని కలిపి ఆ మిశ్రమాన్ని పేస్టులా చేసి ముఖంపై రాసి చేతి వేళ్లను చర్మంపై భాగాన అటు ఇటు గుండ్రంగా తిప్పుతూ మదువుగా మర్దనా చేయాలి. తర్వాత నీటితో ముఖాన్ని బాగా కడిగేసుకోవాలి.
నిమ్మరసం: నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మతచర్మాన్ని తొలగిస్తుంది. చర్మం రంధ్రాలు కనిపించకుండా కాపాడుతుంది. రోజ్ వాటర్ నేచురల్ స్కిన్ టోనర్ కాబట్టి దీన్ని కూడా వాడొచ్చు. అందుకే నిమ్మరసం, రోజ్ వాటర్లను సమపాళ్లల్లో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పది నిమిషాలపాటు అలానే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం నిగనిగ లాడుతూ ఎంతో మదువుగా ఉంటుంది. చర్మం బిగుతుగా కూడా ఉంటుంది.
ఐస్ క్యూబ్స్: ఐస్కు చర్మాన్ని బిగుతుగా ఉంచే గుణం ఉంది. అంతేకాదు పెద్దవైన చర్మ రంధ్రాలను చిన్నవిగా చేస్తుంది . ముఖంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది . మీరు చేయాల్సిందల్లా మొదట ముఖాన్ని బాగా కడుక్కోవాలి. ఆ తర్వాత కొన్ని ఐస్ ముక్కలను పలచటి గుడ్డలో చుట్టి సాగిన చర్మ రంధ్రాల దగ్గర కొన్ని సెకన్ల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీది చర్మం బిగుతుగా తయారవుతుంది.