Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్లీచింగ్... ముఖాన్ని శుభ్రపరిచి, మచ్చల్ని దూరం చేస్తుంది. వాడిపోయిన చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. అయితే ఎప్పుడూ బ్లీచింగ్నే వాడాలని లేదు. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజంగా లభించే పదార్థాలతోనే ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు
- చెంచా చొప్పున తేనె, నిమ్మరసం, రెండు చెంచాల క్రీం కలిపి మిశ్రమంలా చేసి ముఖానికి రాయాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకుపోయిన మురికి వదిలిపోతుంది. తేనె, నిమ్మరసం మిశ్రమం ముఖానికి సహజ బ్లీచ్గా పనిచేసి మచ్చల్ని తొలగిస్తాయి.
- రెండు చెంచాల నారింజ తొక్కల పొడిలో చెంచా చొప్పున పెరుగూ, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తరువాత చన్నీళ్లతో కడిగేయాలి. రెండు చెంచాల గంధంలో చెంచా టొమాటో రసం, రెండు చెంచాల చొప్పున కీరదోస రసం, నిమ్మరసం వేసి ముఖానికి రాయాలి. తర్వాత రెండు నిమిషాల పాటు వేళ్లతో ముఖంపై రుద్దాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.
- బంగాళదుంప రసం ముఖానికి రంగు తేవడంలో సాయపడుతుంది. మొటిమల మచ్చల్నీ బ్లాక్హెడ్స్నీ తరిమేస్తుంది. దీనికోసం బంగాళాదుంపను ఉడికించి చిదిమి ముఖానికి పట్టించి ఆరాక కడిగేయాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే చర్మం పూర్వపు ఛాయను పొందుతుంది.