Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీట్రూట్ని తీసుకుని బాగా ఉడకబెట్టాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేసి, రెండు చెంచాల పాలూ, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకీ రాసుకుని అరగంట పాటు వదిలేయాలి. ఆరాక మంచినీళ్లతో కడిగేసుకోవాలి.
సెనగపిండితో: రెండు మూడు చెంచాల సెనగపిండిలో చెంచా పాలమీగడా, మూడు చెంచాల గోధుమల పొట్టూ, కాస్త పెరుగూ వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత కడిగేసుకోవాలి.
కీరదోసతో: కీరదోస ముక్కల్ని, గుజ్జులా చేసుకుని, దానికి పావుకప్పు నిమ్మరసం, అయిదు చెంచాల తేనె, పాలూ చేర్చి బాగా కలపాలి. ఈ గుజ్జు మరీ జారిపోతున్నట్టు ఉంటే, కొంచెం వరిపిండి కలిపి గట్టిగా చేయొచ్చు. ఈ మొత్తం మిశ్రమాన్ని అయిదారు గంటలపాటు ఫ్రిజ్లో ఉంచాలి. తరువాత తీసి ముఖానికి పూతలా వేసుకుని ఇరవై నిమిషాల పాటు ఉంచి, ఆరాక కడిగేసుకోవాలి.
నిమ్మతో: కేవలం ముఖానికి పూతలు వేసుకోవడమే కాదు, నలుగు పెట్టుకోవడం వల్లా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. చెంపలు నిగారింపు పొందుతాయి. పావుకప్పు నిమ్మరసంలో పాలు కలిపి దాంతో చెంపలకు రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చెంప భాగంలో రక్తప్రసరణపెరిగి గులాబీ రంగులో మెరుస్తాయి.