Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యానికి కావలసిన పోషకాలు డ్రై ఫ్రూట్స్లో పుష్కలంగా ఉంటాయి. చూడ్డానికివి చిన్నవిగా ఉన్నా వీటిలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతగానో ఉపయోగ పడుతాయి. ముఖ్యంగా జీర్ణశక్తిని అధికం చేసి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి.
బాదం :బాదం పాలు ఎంతో శ్రేష్ఠమై నవి బాదం పప్పు మంచి పోష కాహారం. మామూలుగా మనం తీసుకునే పాలతో పోలిస్తే ఇవి ఎంతో ఉత్తమమైనవి అని చెప్ప వచ్చు. ఆవుపాలు తాగ డానికి ఇష్టపడని పిల్లలకు బాదం పాలు పట్టవచ్చు. బాదం పప్పులో ఇనుము, రాగి, ఫాస్పరస్ వంటి ధాతువులు, విటమిన్ 'బి' లు ఆల్మండ్స్లో ఎక్కువగా ఉంటాయి. వీటి రసాయనిక చర్యల వల్ల అధిక శక్తి లభిస్తుంది.
రక్తకణాలు, హీమోగ్లోబిన్ సష్టికి, గుండె, మెదడు, నాడులు, ఎముకలు, కాలేయం సక్రమంగా పనిచేయడానికి ఆల్మండ్లు ఎంతగానో తోడ్పడు తాయి. కండరాలు దఢంగా ఉండిఎక్కువ కాలం పనిచేసేందుకు ఎంతగానో తోడ్పడుతాయి.
బాదం నూనెను రోజూ కొద్దిగా తలకి రాసుకుంటే జుట్టు రాలడం తగ్గి పోతుంది. చుండ్రు, వెంట్రుకలు ఊడటం వంటి వాటికి చక్కటి పరిష్కారం బాదం నూనె.
ఎగ్జిమా వంటి చర్మం వ్యాధులకు అడవి బాదంపప్పు చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం బాదం ఆకులను తీసుకొని వాటిని చూర్ణం చేసి, నీటిలో పేస్ట్లాగా కలిపి ఎగ్జిమా ఉన్న ప్రాంతాల్లో రాస్తే సత్వర ఫలితం కనబడుతుంది. బాదం పేస్ట్తో, పాలను కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే ముఖం కాంతి వంతంగా ఉంటుంది.
జీడిపప్పు : శరీరానికి కావలసిన ప్రొటీన్లు ఇందులో అధికంగా ఉంటాయి. వీటిలో పొటాషియం, విటమిన్ బి, కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే అసంతప్త కొవ్వు పదార్థం గుండె జబ్బులను నివారించే సామర్థ్యాన్ని కలిగిఉంటుంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్, సెలీనియం, రాగి వంటివి తగిన పరిమాణంలో లభిస్తాయి.
ఎండు ద్రాక్ష : ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. మంచి పోషకాహార విలువలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి. అదేవిధంగా ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉం టుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతాయి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి.
ఖర్జూరం : ప్రకతి సిద్ధంగా లభించే గ్లూకోజ్ ఫ్రక్టోజ్లు వీటిల్లో ఉంటాయి. ఖర్జూరాలను నీళ్ళలో రాత్రంతా నానబెట్టి వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది.
అంజీర్ పండు :ఎండిన అంజీర్ పండులో పీచు, రాగి, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, విటమిన్-కె వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఫ్లవనాయిడ్స్, పాలిఫినోల్స్ను కూడా వీటిల్లో ఉంటాయి. వీటిల్లో యాంటీఆక్సి డెంట్స్ ఎక్కువమొత్తంలో ఉండే శరీర ఆరోగ్యానికి తోడ్పడుతాయి.