Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండ్లు, కూరగాయలు ద్వారా ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ లాంటి పోషక పదార్థాలు మన శరీరానికి అందుతాయి. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన పళ్లను శుభ్రం చేయకుండా ఆబగా తింటే అంతే సంగతులు. తినేముందు ఈ కూరగాయలు, పండ్లను ఇలా శుభ్రం చేయండి.
- ఆపిల్, ద్రాక్ష, చెర్రీ లాంటి పండ్లతో పాటు, టమాట, బంగాళాదుంప వంటి కూరగాయల్ని సింక్ నుంచి ఫాస్ట్గా వచ్చే వాటర్తో శుభ్ర పరచటం మంచిది.
- ఒక పెద్ద బౌల్లో కొంచెం ఉప్పు కలిపి కూర గాయల్ని, పండ్లను పది నిమిషాల పాటు ఉంచాలి. దీని వల్ల దానిపై ఉండే హానికర రసాయనాలు తొలిగిపోతాయి. ఆ తర్వాత మంచి నీళ్లతో మళ్లీ వాటిని శుభ్రం చేయాలి.
- ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లను తీసుకుని అందు లో కొంచెం వెనిగర్ వేయాలి. ఆ గిన్నెలో కూర గాయలు, పండ్లు వేసి పదిహేను నిమిషాల పాటు ఉంచితే పండ్లపై ఉండే రసాయనాలు, మైనం పోతుంది. అలాగే కూరగా యలపై ఉండే చెడు బ్యాక్టీరియా వదిలిపోతుంది.
- మంచి నీరు, నిమ్మరసం, వెనిగర్ కలిపిన మిశ్ర మాన్ని ఒక స్ప్రే బాటిల్లో తీసుకుని పండ్లు, కూరగాయలపై స్ప్రే చూయాలి. ఆ తర్వా త మంచి నీళ్లతో శుభ్రం చేసి మెత్తటి వస్త్రంతో తుడవాలి.