Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పనీర్.. మాస్గా చెప్పాలంటే జున్ను. జున్నును ఇష్టంగా తినే చాలామంది పనీర్ను ఇష్టపడరు. కానీ.. పనీర్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. శాఖాహారులకు ఇది పోషకాహారం. అలాంటి పనీర్తో కొన్ని స్పెషల్స్.
పనీర్ బటర్ మసాలా
కావాల్సిన పదార్థాలు : పనీర్-225 గ్రాముల, బటర్-2 పెద్ద చెంచాలు, నూనె-1 చెంచా, లవంగాలు-3, యాలకులు-3, జాపత్రి-2, ఉల్లిగడ్డ -1 మీడియం సైజు, పేస్టు చేసుకోవాల్సినవి, అల్లంవెల్లుల్లి ముద్ద-1చెంచా, టమాటలు -4 (గుజ్జు), జీడిపప్పు -7(పేస్టు), కారం -రుచికి తగినంత, ధనియాలపొడి-చెంచా, పసుపు-చిటికెడు, ఉప్పు -తగినంత, గరంమాసాలా-ఒక చెంచా, కసూరీమేతి-ఒక చెంచా, ఫ్రెష్ క్రీమ్-రెండు చెంచాలు
తయారీవిధానం : పాన్కి బటర్ రాసి పనీర్ ముక్కలను బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి. మరోవైపు కుడా తిప్పి అలాగే కాల్చాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్లో ఇంకాస్త బటర్ కొద్దిగా నూనె వేసి, యాలకులు, లవంగాలు మరియు జాపత్రి వెయ్యాలి. దానికి ఉల్లిపాయ, అల్లంవెల్లుల్లి పేస్టు జత చేయాలి. అది గోధుమ రంగులోకి మారుతుండగా టమాటా గుజ్జుని వేయాలి. రెండు నిమిషాలు ఉడికించి, ఒక్క గరం మసాలా తప్ప మిగిలిన పొడులన్నీ వేయాలి. బాగా ఉడికి నూనె పైకి తేలుతున్నప్పుడు ఒక కప్పు నీళ్లు కలిపి ఉడికించాలి. తరువాత జీడిపప్పు పేస్టు వేసి బాగా కలపాలి. దానికి గరం మసాలా, కసూరీ మేతి వేసి కలిపాలి. ఇప్పుడు వేయించిన పనీర్ ముక్కలను వేసి చిన్న మంటపైన మరో రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే... పనీర్ బటర్ మసాలా రెడీ.
చిల్లి పనీర్
కావాల్సిన పదార్థాలు : పనీర్ -400 గ్రాములు, కాప్సికం-ఒకటి క్యూబ్స్లా తరగాలి, ఉల్లిపాయ -ఒకటి క్యూబ్స్లాగా కోయాలి. అల్లం -1 చెంచా తురిమినది, మైదా పిండి -2 పెద్ద చెంచాలు. నీళ్ళు -పావు కప్పు, ఉప్పు- రుచికి తగినంత, మిరియాలు -పావు చెంచా, సోయా సాస్ -ఒకటిన్నర చెంచా, చిల్లి సాస్ -2 చెంచాలు, టమాటా సాస్ -2 చెంచాలు, ఎండు మిర్చి -2, నూనె- 2 పెద్ద చెంచాలు, తేనె- 1 చెంచా, కార్న్ పిండి-కొద్దిగా నీళ్లలో కలుపుకోవాలి
తయారీవిధానం: పనీర్ని పెద్ద ముక్కలుగా తరిగి తడిలేకుండా గుడ్డతో తుడవాలి. కొంచం కార్న్ పిండి చల్లి పక్కన పెట్టాలి. కాప్సికం, ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి. మైదా పిండిలో ఉప్పు, మిరియాలు వేసి బాగా కలుపుకోవాలి. పనీర్ ముక్కలను ఈ పిండిలో ముంచి పాన్ పైన దోరగా వేయించాలి. ఇష్టమైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. మరో పాన్లో నూనె వేడి చేసి, ఎండు మిర్చి, అల్లం , ఉల్లిపాయ, కాప్సికం ముక్కలు వెయ్యాలి. వేయించాక అందులో పనీర్ ముక్కలను వెయ్యాలి. మొత్తాన్ని బాగా కలపాలి. తరువాత టమాటా రసం, సోయా సాస్, వినిగర్, చిల్లి సాస్ లను కలపాలి, కార్న్ పిండిలో కాస్త నీళ్ళు కలపాలి. ఎండుమిర్చి పొడిని కొంచం చల్లాలి. స్టార్టర్గా, ఫ్రైడ్ రైస్, నూడుల్స్కు సైడ్డిష్ గా వడ్డించవచ్చు.
కడాయి పనీర్
కావాల్సిన పదార్థాలు : పనీర్ -2 కప్పులు, పెద్ద ఉల్లిపాయలు -2, ఎర్ర టమాటాలు -4, మధ్యస్తంగా ఉన్న కాప్సికం -2, అల్లం వెల్లుల్లి పేస్టు- 1 చెంచా, కశ్మీరీ ఎర్రమిర్చి -6 ( రుచికి సరిపడా), ధనియాలు -3 చెంచాలు, జీడిపప్పులు- 10 (తప్పనిసరి కాదు), తాజాగా క్రీం- ముప్పావు కప్పు, కారం - తగినంత, గరం మసాలా -1 చెంచా, కసూరి మేతి -1/2 చెంచా, కొత్తిమీర ఆకులు- గుప్పెడు, ఉప్పు-రుచికి సరిపడా, నూనె -చెంచాలు
తయారీ విధానం: ధనియాలు, ఎండుమిర్చిని వేయించి పొడి చేసుకోవాలి. జీడిపప్పును నీళ్ళలో నానబెట్టి మెత్తని పేస్టుగా రుబ్బాలి. ఒక పెద్ద ఉల్లిపాయని పేస్టుగా చేసుకోవాలి. టమాటాలను కూడా గుజ్జు చేసుకోవాలి. మిగిలిన పెద్ద ఉల్లిపాయలు, పనీర్, కాప్సికం తరిగి పక్కన పెట్టుకోవాలి. పాన్లో నూనె వేసి వేడి అయ్యాక పన్నీరు ముక్కలు వేయించుకోవాలి. అవి తీసి పక్కనపెట్టి ఇంకొంచెం నూనె వేసి.. ఉల్లిపాయలు, కాప్సికం వేసి 5 నిమి షాలపాటు వేయించి తెసేయాలి. ఇంకో చెంచా నూనె వేసి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేదాకా వేయించాలి.
ఇప్పుడు మనం కారం, ధనియాల పొడిని ఇందులో కలిపి ఒక నిమిషం వేయించాలి. తరువాత టమాటా గుజ్జు వేసుకోవాలి. కాసిన్ని నీళ్లు పోసి, ఉప్పు, గరంమసాలాపొడి, జీడిపప్పు పేస్టు వేసి పచ్చివాసన పోయేదాకా ఉడికించాలి. మంట తగ్గించి క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు పనీర్, ఉల్లిపాయ, కాప్సికం ముక్కలే వసుకుని మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. కసూరీ మేతి వేసి కలిపి... కొత్తి మీర ఆకులు వేసి దింపుకోవాలి. అంతే కడాయి పనీర్ రెడీ!
పనీర్ ఫ్రై
కావాల్సిన పదార్థాలు : పనీర్ ముక్కలు -100 గ్రా, టమాటాలు-4, ఉల్లిపాయ- 1, గరంమసాలా-1/2స్పూన్, ఉప్పు- సరిపడా, పసుపు- 1/2టేబుల్ స్పూన్, కారం-1టేబుల్ స్పూన్, ధనియాలపొడి-1స్పూన్, నెయ్యి-1స్పూన్, నెయ్యి -1టేబుల్ స్పూన్, మిరియాలపొడి-1 స్పూన్, అల్లంవెల్లుల్లి పేస్ట్- 1స్పూన్, కాజు పేస్ట్ -1స్పూన్, నూనె -డీప్ ఫ్రై కి సరిపడా
తయారీవిధానం: స్టవ్ పైన కడాయి పెట్టి నూనె వేడి అయ్యాక అందులో పనీర్ ముక్కలు రెండు వైపులా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కారం ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. ఉప్పు, పసుపు, టమాటా గుజ్జు, అల్లంవెలుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేదాక వేయించాలి. కొద్దిగా నీళ్లు పోసి ఉడికిన తరువాత అందులో పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. నీరు అంతా పోయి మసాలా ముక్కలకు పట్టిన తరువాత ధనియాలపొడి, మిరియాల పొడి వేసి కలపాలి. చివరగా కొత్తిమీర, నెయ్యివేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
పనీర్ టిక్కా
కావల్సిన పదార్థాలు:పనీర్- 250 గ్రాములు, పెరుగు-ఒక కప్పు, ఉల్లిగడ్డలు -రెండు(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) టమాటా- 2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి), అల్లం వెల్లుల్లి పేస్టు-ఒక చెంచా, పచ్చిమిర్చి-2(మధ్యలకు కట్ చేసుకోవాలి), జీడిపప్పు-3 పేస్టు చేసుకోవాలి. టిక్కా మసాలా -ఒక చెంచా, చాట్ మసాలా-ఒక చెంచా, ఉప్పు-రుచికి సరిపడా
తయారీవిధానం: ముందుగా మీరు పన్నీర్ ముక్కలను మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్లో కొద్దిగా నూనె వేసి, మీడియం మంట మీద వేడి చేయాలి. అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడికే వరకూ వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు టిక్కా మసాలా వేసి, మరో 5 నిముషాలు తక్కువ మంట మీద వేయించాలి. 5నిముషాల తర్వాత ఛాట్ మసాలా, చెన్నా మసాలా కూడా వేసి, మీడియం మంట మీద బాగా వేయించాలి. 5నిముషాల తర్వాత పెరుగు కూడా వేసి మిగిలిన మిశ్రమాలన్నింటినీ మిక్స్ చేస్తూ నిధానంగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న పన్నీర్ ముక్కలు కూడా వేసి, బాగా మిక్స్ చేయాలి. తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేసి పన్నీర్ మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్తో గార్నిష్ చేసుకోవాలి.
చిల్లి పనీర్
కావాల్సిన పదార్థాలు : పనీర్ -400 గ్రాములు, కాప్సికం-ఒకటి క్యూబ్స్లా తరగాలి, ఉల్లిపాయ -ఒకటి క్యూబ్స్లాగా కోయాలి. అల్లం -1 చెంచా తురిమినది, మైదా పిండి -2 పెద్ద చెంచాలు. నీళ్ళు -పావు కప్పు, ఉప్పు- రుచికి తగినంత, మిరియాలు -పావు చెంచా, సోయా సాస్ -ఒకటిన్నర చెంచా, చిల్లి సాస్ -2 చెంచాలు, టమాటా సాస్ -2 చెంచాలు, ఎండు మిర్చి -2, నూనె- 2 పెద్ద చెంచాలు, తేనె- 1 చెంచా, కార్న్ పిండి-కొద్దిగా నీళ్లలో కలుపుకోవాలి
తయారీవిధానం: పనీర్ని పెద్ద ముక్కలుగా తరిగి తడిలేకుండా గుడ్డతో తుడవాలి. కొంచం కార్న్ పిండి చల్లి పక్కన పెట్టాలి. కాప్సికం, ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి. మైదా పిండిలో ఉప్పు, మిరియాలు వేసి బాగా కలుపుకోవాలి. పనీర్ ముక్కలను ఈ పిండిలో ముంచి పాన్ పైన దోరగా వేయించాలి. ఇష్టమైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. మరో పాన్లో నూనె వేడి చేసి, ఎండు మిర్చి, అల్లం , ఉల్లిపాయ, కాప్సికం ముక్కలు వెయ్యాలి. వేయించాక అందులో పనీర్ ముక్కలను వెయ్యాలి. మొత్తాన్ని బాగా కలపాలి. తరువాత టమాటా రసం, సోయా సాస్, వినిగర్, చిల్లి సాస్ లను కలపాలి, కార్న్ పిండిలో కాస్త నీళ్ళు కలపాలి. ఎండుమిర్చి పొడిని కొంచం చల్లాలి. స్టార్టర్గా, ఫ్రైడ్ రైస్, నూడుల్స్కు సైడ్డిష్ గా వడ్డించవచ్చు.
కడాయి పనీర్
కావాల్సిన పదార్థాలు : పనీర్ -2 కప్పులు, పెద్ద ఉల్లిపాయలు -2, ఎర్ర టమాటాలు -4, మధ్యస్తంగా ఉన్న కాప్సికం -2, అల్లం వెల్లుల్లి పేస్టు- 1 చెంచా, కశ్మీరీ ఎర్రమిర్చి -6 ( రుచికి సరిపడా), ధనియాలు -3 చెంచాలు, జీడిపప్పులు- 10 (తప్పనిసరి కాదు), తాజాగా క్రీం- ముప్పావు కప్పు, కారం - తగినంత, గరం మసాలా -1 చెంచా, కసూరి మేతి -1/2 చెంచా, కొత్తిమీర ఆకులు- గుప్పెడు, ఉప్పు-రుచికి సరిపడా, నూనె -చెంచాలు
తయారీ విధానం: ధనియాలు, ఎండుమిర్చిని వేయించి పొడి చేసుకోవాలి. జీడిపప్పును నీళ్ళలో నానబెట్టి మెత్తని పేస్టుగా రుబ్బాలి. ఒక పెద్ద ఉల్లిపాయని పేస్టుగా చేసుకోవాలి. టమాటాలను కూడా గుజ్జు చేసుకోవాలి. మిగిలిన పెద్ద ఉల్లిపాయలు, పనీర్, కాప్సికం తరిగి పక్కన పెట్టుకోవాలి. పాన్లో నూనె వేసి వేడి అయ్యాక పన్నీరు ముక్కలు వేయించుకోవాలి. అవి తీసి పక్కనపెట్టి ఇంకొంచెం నూనె వేసి.. ఉల్లిపాయలు, కాప్సికం వేసి 5 నిమి షాలపాటు వేయించి తెసేయాలి. ఇంకో చెంచా నూనె వేసి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేదాకా వేయించాలి.
ఇప్పుడు మనం కారం, ధనియాల పొడిని ఇందులో కలిపి ఒక నిమిషం వేయించాలి. తరువాత టమాటా గుజ్జు వేసుకోవాలి. కాసిన్ని నీళ్లు పోసి, ఉప్పు, గరంమసాలాపొడి, జీడిపప్పు పేస్టు వేసి పచ్చివాసన పోయేదాకా ఉడికించాలి. మంట తగ్గించి క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు పనీర్, ఉల్లిపాయ, కాప్సికం ముక్కలే వసుకుని మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. కసూరీ మేతి వేసి కలిపి... కొత్తి మీర ఆకులు వేసి దింపుకోవాలి. అంతే కడాయి పనీర్ రెడీ!
పనీర్ ఫ్రై
కావాల్సిన పదార్థాలు : పనీర్ ముక్కలు -100 గ్రా, టమాటాలు-4, ఉల్లిపాయ- 1, గరంమసాలా-1/2స్పూన్, ఉప్పు- సరిపడా, పసుపు- 1/2టేబుల్ స్పూన్, కారం-1టేబుల్ స్పూన్, ధనియాలపొడి-1స్పూన్, నెయ్యి-1స్పూన్, నెయ్యి -1టేబుల్ స్పూన్, మిరియాలపొడి-1 స్పూన్, అల్లంవెల్లుల్లి పేస్ట్- 1స్పూన్, కాజు పేస్ట్ -1స్పూన్, నూనె -డీప్ ఫ్రై కి సరిపడా
తయారీవిధానం: స్టవ్ పైన కడాయి పెట్టి నూనె వేడి అయ్యాక అందులో పనీర్ ముక్కలు రెండు వైపులా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కారం ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. ఉప్పు, పసుపు, టమాటా గుజ్జు, అల్లంవెలుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేదాక వేయించాలి. కొద్దిగా నీళ్లు పోసి ఉడికిన తరువాత అందులో పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. నీరు అంతా పోయి మసాలా ముక్కలకు పట్టిన తరువాత ధనియాలపొడి, మిరియాల పొడి వేసి కలపాలి. చివరగా కొత్తిమీర, నెయ్యివేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
పనీర్ టిక్కా
కావల్సిన పదార్థాలు:పనీర్- 250 గ్రాములు, పెరుగు-ఒక కప్పు, ఉల్లిగడ్డలు -రెండు(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) టమాటా- 2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి), అల్లం వెల్లుల్లి పేస్టు-ఒక చెంచా, పచ్చిమిర్చి-2(మధ్యలకు కట్ చేసుకోవాలి), జీడిపప్పు-3 పేస్టు చేసుకోవాలి. టిక్కా మసాలా -ఒక చెంచా, చాట్ మసాలా-ఒక చెంచా, ఉప్పు-రుచికి సరిపడా
తయారీవిధానం: ముందుగా మీరు పన్నీర్ ముక్కలను మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్లో కొద్దిగా నూనె వేసి, మీడియం మంట మీద వేడి చేయాలి. అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడికే వరకూ వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు టిక్కా మసాలా వేసి, మరో 5 నిముషాలు తక్కువ మంట మీద వేయించాలి. 5నిముషాల తర్వాత ఛాట్ మసాలా, చెన్నా మసాలా కూడా వేసి, మీడియం మంట మీద బాగా వేయించాలి. 5నిముషాల తర్వాత పెరుగు కూడా వేసి మిగిలిన మిశ్రమాలన్నింటినీ మిక్స్ చేస్తూ నిధానంగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న పన్నీర్ ముక్కలు కూడా వేసి, బాగా మిక్స్ చేయాలి. తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేసి పన్నీర్ మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్తో గార్నిష్ చేసుకోవాలి.