Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్మం నలిగిపోయినట్లు, నల్లగా, కాంతిహీనంగా, పొడిబారిపోయినట్లు ఫీలవుతుంటే మాత్రం ఎవరైనా ద్రాక్ష పండ్లకు జేజేలు చెప్పాల్సిందే మరి. ఆఫీసుల్లో, ఇళ్లలో ఎక్కడున్నా సరే చిట్లిపోయిన, మొరటుగా మారిన చర్మం చాలా అసౌకర్యంగా ఉంటుంది. తిరిగి సహజమైన చర్మకాంతిని మీరు పొందాలంటే సౌందర్య సాధనాలవైపు చూపు సారించడానికి బదులు చౌకగా దొరికే ద్రాక్ష పండ్లను ఆరగించడం ఒక చక్కని పరిష్కారం..
- ఒక మాటలో చెప్పాలంటే.. ఏ రంగు చర్మం కలవారికైనా ద్రాక్ష రసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఎండల నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి పాతతరం అందగత్తెలు ఈ విధంగానే తమ అందాన్ని కాపాడుకునేవారట. పైగా శరీరంలో వేడిని పోగొట్టుకోవడానికి ద్రాక్ష ఎంతో మేలు చేస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
- అందుకే తప్పనిసరిగా ద్రాక్ష పళ్ల రసం క్రమం తప్పకుండా తాగుతుండండి. ద్రాక్ష రసాన్ని తాగడంతో మాత్రమే సరిపెట్టుకోక ద్రాక్ష పండ్లను చర్మానికి పూతగా కూడా తయారు చేసుకుని నిగారింపులు తీసుకురావచ్చు. ఎలాగంటే ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడర్కు కొద్దిగా పౌడర్ను కలిపి దాన్ని పేస్టులా తయారు చేయండి. దానికి కీరదోస జ్యూస్ కాని, ద్రాక్ష రసం కాని కలుపుకుని చర్మానికి రాయండి. ఒక గంట తర్వాత దాన్ని తీసేసి శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరైజ్ రాసుకుంటే మెరిసే నున్నని, మదువైన చర్మం మీ సొంతమవుతుంది.