Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పంటల్లో పురుగుమందుల వాడకం ఎక్కువైపోయింది. ప్రతి పంటకూ పురుగులమందే. దాంతో మనం తినే ఆహారమూ విషపూరితమైపోతోంది. అందుకే మనం ఇంట్లోనూ కొన్ని ఆకుకూరలు, కూరగాయలను పండించుకోవచ్చు. ఇందుకోసం ఎక్కువ స్థలం అవసరం లేదు. కాస్త ఓపిక, ఇంకొంత సమయం కేటాయిస్తే చాలు...
ఙ కట్ చేసిన కోక్ టిన్లలో కంపోస్టు నింపి మెంతికూర గింజలు వేస్తే పది రోజుల్లో మొలకలు వస్తాయి. నాలుగు టిన్లలో నాలుగు రోజుల వ్యవధిలో మెంతి కూర వేస్తే, వారానికి నాలుగు సార్లు వేర్వేరు కూరల్లో మెంతికూర వాడుకోవచ్చు. కొన్న మెంతికూర కన్నా ఇంటిలో పెరిగే మెంతికూర రుచి, వాసన తేడా ఉం టుంది. స్కూల్ బ్యాగులకు సైతం రెండు రం ధ్రాలు చేసి వర్మీ కంపోస్టు వేసి మొక్కలను పెంచ వచ్చు. ఐస్ క్రీం డబ్బాలలో కూడా మొక్కలను పెంచవచ్చు.
ఙ బకెట్లు, డబ్బాలలో మట్టి, కంపోస్టు మిశ్రమం పోసి మొక్కలు పెంచొచ్చు. ఎక్కువైన నీరు బయటకు పోయేలా వీటికి అడుగున రంధ్రం ఉండాలి. ఆ రంధ్రం పూడిపోకుండా కొన్ని పెంకు ముక్కలో, పల్చని రాళ్ల ముక్కలో వేసి, ఆపైన కొన్ని ఎండు ఆకులు వేసి, మట్టి, కంపోస్టు మిశ్రమాన్ని కుండీలో పోయాలి. కుండీలో మట్టి మిశ్రమం నింపిన తర్వాత అది పూర్తిగా కింది వరకూ తడిసేలా నీరు పోయాలి లేదా దానికన్నా పెద్ద బక్కెట్ నీటిలో పెట్టి గాలి అంతాపోయి కుండీలో మట్టి అంతా తడిసే వరకూ కొద్ది నిముషాలు ఉంచి, కుండీని బయటకు తీయాలి. అదనంగా కుండీలో ఉన్న నీరు కుండీ కింది రంధ్రం నుంచి బయటకు వెళ్లి పోతాయి. అలా వెళ్లకపోతే ఆ కుండీ సరిగా లేనట్టే. తగుమాత్రంగా తడిలో మాత్రమే మొక్క ఏపుగా పెరు గుతుంది. ఎక్కువ ఉన్న నీరు బయటకు పోని కుండీ లో మొక్కలు ఎన్నాళ్లో బతకవు. కుండీలో మట్టి బాగా తడిగా ఉంటే ఆ రోజుకు నీరు పోయకుండా ఉంటేనే మంచిది. అతి తేమ మొక్కకు హానికరం కూడా.
- నలుచదరంగా ఇటుకలు పేర్చిన మడుల్లో కూరగా యలు, ఆకుకూరలు పెంచవచ్చు. సాధారణంగా నేలలో పెంచడం కన్నా ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఎర్ర మట్టి, కంపోస్టు మిశ్రమంలో కూరగాయల మొక్కలు చక్కగా పెరుగుతాయి. ఎర్రమట్టి, కంపోస్టు మిశ్రమంలో పెంచుతున్నందున మామూలు కన్నా కనీసం 3 రెట్లు దిగుబడి వస్తుంది. నీటి అవసరం తక్కువ, కలుపు రాదు, శ్రమ తక్కువ. నీరు పరిమి తంగా చల్లుతాం కాబట్టి సిమెంటుతోనో, మట్టితోనో మడి చుట్టూ ఇటుకల గోడ కట్టనక్కర్లేదు.
- ప్లాస్టిక్ ట్రేలలో మొదట పాలిథిన్ పేపర్ పరచాలి. అడుగున చిన్న రంధ్రం చేయాలి. నీరు ఎక్కువైతే కిందకు జారిపోయేందుకు ఈ ఏర్పాటు. అడుగున ఒక అంగుళం ఎత్తు మట్టిని ఆపైన రెండంగుళాల మేర వర్మీ కంపోస్టు వేయాలి. తోటకూర, గోంగూర, బచ్చలి కూర, చుక్క కూర, పాలకూర, మెంతికూర ఇలా ఒక్కో రకాన్ని ఒక్కో ట్రేలో ప్రయోగాత్మకంగా వేయాలి. కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు, తోటకూర మొ లకలు రెండు మూడు రోజులకే చనిపోతాయి. ఇతర ఆకుకూరలు మాత్రం ఏపుగా పెరుగుతాయి. ఆకు కూరల విత్తనాలు మూడు రోజులకే మొలకలు వస్తా యి. ఈ ట్రేలలో గోధుమ గడ్డిని కూడా పెంచవచ్చు.
- మొక్కలకు కనీసం 5,6 గంటల పాటు ఎండ తగ లడం అవసరం. పురుగులు, చీడపీ డలను నివారిం చడానికి 15 రోజులకొకసారి పంచగవ్య వంటి మిశ్రమాలను చల్లుకోవచ్చు. 5 లీటర్ల నీటిలో అర లీటరు పంచగవ్య మిశ్రమం కలిపి తగు మాత్రంగా పిచికారి చేయాలి. ఏ రెమ్మ మీద పురుగు, తెగులు కనిపించినా దాన్ని తుంచి పారేయడం ఉత్తమం.
- అన్ని కూరగాయలు, ఆకుకూరలు ఒకే రోజు విత్తుకోకూడదు. ఇప్పుడు గుప్పెడు గింజలు, వారం పది రోజులు గడిచాక మరికొన్ని గిం జలు..., అలా విడతల వారీగా చల్లు కోవాలి. ప్రతివారం ఆకుకూరలు, కూర గాయలు అందుబాటులో ఉంచు కోవా లంటే ఇలాంటి ఉపాయం అవ సరమే. ఈ విధంగా ఏడాది పొడ వునా పుష్కలంగా ఆకు కూర లతో పాటు కూరగాయలు కూడా ప్రణాళిక ప్రకారం పెంచుకోవచ్చు.