Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాదాలు పగుళ్ళతో కాళ్ళు అందవిహీనంగా ఉంటాయి. పాదాల మీద శ్రద్ద తీసుకోకపోవడం, పోషకాహార లోపం పాదాల పగుళ్ళకు కారణం. అంతే కాదు, పగిలిన పాదాలు అనారోగ్యానికి సూచన అని కూడా అంటారు. కాళ్ల పగుళ్ళకు వెంటనే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, పరిస్థితి మరింత ఎక్కువ అవుతుంది. ఇంట్లోనే తయారు చేసిన ఓట్ మీల్ లెమన్ స్క్రబ్ పగిలిన పాదాలను నివారించడానికి సహజమైన పద్ధతి.
రెండు టేబుల్ స్పూన్లు ఓట్మీల్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరం, రెండు చెంచాల ఉప్పఉ తీసుకుని కలపాలి. పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగిన తరవుఆత ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. పావుగంపాటు వదిలేసి... తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేస్తే వారంలో మీ పాదాల పగుళ్లు మాయమవుతాయి.