Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెడ, వెన్నెముక, భుజాల నొప్పులతో బాధపడేవారు రోజుకు కొద్ది సమయం తమ కోసం కేటాయించుకోవాలి. యోగాసనాలు క్రమం తప్పకుండా వేయడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. శరీరంలోని కండరాలను బలోపేతం చేసే ఆసనాల్లో అర్థ శీర్షాసనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
అర్ధ శీర్షాసనం
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా కొద్దిగా ముందుకు వంగి రెండు చేతులవేళ్ళు ఇంటర్లాక్ చేసుకొని మోచేతులు, నేలపైన పెట్టాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదులుతూ మోకాళ్ళ పైకి లేవాలి. ఈ స్థితిలో శ్వాస సహజంగా ఉండాలి. ఈ ఆసనంలో ఇరవై సెకండ్ల పాటు ఉండి యధాస్థితికి రావాలి.
ఉపయోగాలు..
- తలకి రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
- మెడ, వెన్నెముక, భుజాల కండరాలు బలపడతాయి
- కాళ్ళకి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి
- జుట్టు రాలడం తగ్గుతుంది
- మొలల సమస్య తగ్గుతుంది
జాగ్రత్తలు..
- అధిక రక్తపోటు, గుండె సమస్యలు, మెదడుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ ఆసనం చేయవద్దు
- నెలసరిలో ఉన్నవారు, గర్భిణీలు ఈ ఆసనం సాధన చేయవద్దు
- భుజాలు, వెన్నెము సమస్యలు ఉన్నవారు ఈ ఆసనం వేయవద్దు.