Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలం వాతావరణంలోని తేమ, చల్లదనం వల్ల చర్మం సహజ మెరుపును కోల్పోతుంది. జిడ్డుగా తయారవటం, మొటిమలు రావటంలాంటి సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా వేధిస్తుంటాయి. వీటి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన ఫేస్ప్యాక్స్ వేయాలి.
శాండల్వుడ్ ప్యాక్: ఒక టేబుల్ స్పూను గంధం పొడి, పావు కప్పు రోజ్ వాటర్, పావు టీస్పూను పసుపు తీసుకుని అన్నిటినీ కలిపి పేస్ట్లా తయారుచేయాలి. ఆ తరువాత ముఖానికి అప్లై చేసి 30 నిమిషాలాగి చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి.
బనానా ప్యాక్ : పుదీనా, అరటి పండును తీసుకోవాలి. గుప్పెడు పుదీనా ఆకుల్ని మెత్తగా దంచాలి. అరటి పండు గుజ్జుకు పుదీనా పేస్ట్ కలిపి ముఖానికి పట్టించాలి. పది నిమిషాలాగి గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.
లెమన్ బ్లీచ్: ముల్లంగి కోరుకు నిమ్మరసం కలపాలి. ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలాగి వేళ్లతో గుండ్రంగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.
ఓట్మీల్ ప్యాక్: 3 టేస్పూన్ల ఓట్మీల్, ఒక ఎగ్ వైట్, ఒక టీస్పూను తేనె, ఒక టీస్పూను పెరుగు తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి ఫ్రిజ్లో చల్లబరచాలి. ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని ఈ ప్యాక్ అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ప