Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ బిజీ జీవితంలో చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో నడుం నొప్పి ప్రధానమైనది. ఒత్తిడితో పనిచేయడం, ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, అధిక పనిగంటలు వంటి ఎన్నో కారణాల వల్ల నడుం నొప్పి వస్తుంటుంది. దీని వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్యసమస్యలను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ప్రారంభ దశలోనే నడుంనొప్పిని తరిమేయవచ్చు.
కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరాన్ని కలపాలి. ఆ మిశ్రమాన్ని ఐదు నిమిషాలపాటు వేడి చేయాలి. అది పూర్తిగా చల్లారిన తరువాత ఓ బాటిల్లో పోసి నిల్వ చేసుకోవాలి. పడుకోబోయే ముందు ఈ నూనెతో నడుముకు మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.
గోరు వెచ్చని నీటిలో కొన్ని చుక్కలు నీలగిరి తైలం (యూకలిప్టస్ ఆయిల్) వేయాలి. ఈ నీటితో స్నానం చేయడం వల్ల ఒళ్లు నొప్పులే కాకుండా ఒత్తిడి నుంచి కూడా బయటపడొచ్చు.
టీవీ చూస్తున్నప్పుడు లేదా కూర్చొని ఏదైనా పనిచేస్తున్నప్పుడు వేడి నీటిబ్యాగుతో కాపుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా నడుం నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
స్నానం చేయడానికి గంట ముందు ఆవనూనెతో నడుం భాగాన్ని మసాజ్ చేసుకోవాలి. తరువాత వేడినీటితో మాత్రమే స్నానం చేయాలి.
గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు, కొన్ని చుక్కలు తేనె కలుపుకొని ప్రతి రోజూ తాగాలి. ఇది తాగడం వల్ల ఒళ్లు నొప్పులు, నడుం నొప్పితోపాటు దగ్గు, జలుబు కూడా తగ్గుతాయి.
ప్రతి రోజూ అల్లం టీ తాగడం ద్వారా నడుం నొప్పి వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. హెర్బల్ నూనెతో నడుంని మసాజ్ చేసుకోవడం ద్వారా కూడా నొప్పి నుంచి త్వరగా బయటపడొచ్చు. ప