Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బత్తాయి పండ్లని వేడినీళ్లలో ఐదు నిమిషాలు ఉంచి తొక్క తీస్తే దాని కింద ఉండే తెల్లటి పొర కూడా తేలిగ్గా వచ్చేస్తుంది.
- బెండకాయ వేపుడు ముద్దలా కాకుండా ఉండా లంటే కడాయిలో ముక్కలు వేయగానే కాస్త మజ్జిగ కలిపితే జిగురు రాదు.
- దోశ పెనంపైన ఒక స్పూను ఉప్పు వేగించి ఆ తరువాత దోశలు వేస్తే నాన్స్టిక్ పెనంపై వచ్చినట్టే వస్తాయి.
- సలాడ్ కోసం కోసే పండ్ల ముక్కలు నల్ల బడ కుండా ఉండాలంటే వాటిపైన నిమ్మకాయ రసం పిండాలి. రెండు పండ్ల ముక్కలకు సగం నిమ్మకాయ రసం సరిపోతుంది.
- శెనగపిండిలో పెరుగు కలిపి వేస్తే పకోడీలు మెత్తగా వస్తాయి.
- పల్లిగింజల్ని వేడి నీళ్లలో ఒక్క క్షణం ఉంచి నీళ్లు వంపేసి వేగిస్తే కరకరమంటూ రుచిగా ఉంటాయి.
- వేపుడు కూరల్లో నూనె ఎక్కువైతే కాస్త శెనగపిండి చల్లాలి. ఇలా చేయడం వల్ల శెనగపిండి నూనె పీల్చుకుంటుంది. కూరకి రుచి కూడా వస్తుంది.
- లేతసొరకాయ గుజ్జులో నానిన బియ్యం వేసి మెత్తగా రుబ్బి అల్లం, పచ్చిమిర్చి, ఉల్లి పాయ ముక్కలు, ఉప్పు కలపాలి. ఈ పిండితో దోశలు వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి.
- మరుగుతున్న టీ పొడి నీళ్లలో చిటికెడు శొంఠిపొడి, రెండు యాలకులు వేస్తే రుచికరమైన టీ రెడీ.
- నిమ్మకాయ ఊరగాయని పప్పులో వేస్తే రుచిగా ఉంటుంది. ఈ పప్పుతో పాటు వేడివేడి మిరపకాయ బజ్జీ లు నంజుకుని తింటే ఇక ఆ రుచి గురించి చెప్పక్కర్లేదు.