Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొటిమల నివారణ
- చెంచా కస్తూరి పసుపు ముద్దకు, అరచెంచా నువ్వుల నూనె కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
- మూడు పూటలా బఠాణీ గింజ సైజు వేపాకు ముద్ద మింగితే ఎన్ని క్రీములు వాడినా వదలని మొటిమలు సైతం వదిలిపోతాయి.
- చెంచా చొప్పున నిమ్మ రసం, పాలుకలిపి రాత్రి పూట రాసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమల మచ్చలు పోతాయి.
చర్మ సమస్యల నివారణ
- చెమట, కాలుష్యం, పేలుకారణంగా ఇన్ఫెక్షన్ ఏర్పడి తల మీద కురుపులు, పుండ్లు పడితే చెంచా వేపనూనె, 10 గ్రాముల కర్పూరం కలిపి మాడుకు పట్టిస్తే పేలు నశించటమే గాక పుండ్లు, కురుపులు పూర్తిగా మాడిపోతాయి.
- గజ్జి బాధితులు గుప్పెడు వేపాకు, చెంచా పసుపు, చెంచా ఉప్పు దంచి ముద్దజేసి గజ్జి కురు పుల మీద రుద్ది గంట తరువాత సున్ని పిండితో స్నానంచేస్తే గజ్జి కురుపులు మానిపోతాయి.
పాదాల పగుళ్ళు
- పగిలిన మడమలు, పాదాలకు వారం రోజుల పాటు రోజూ మగ్గిన అరటి పండు గుజ్జును పాదా లకు మర్దన చేసి అరగంట తర్వాత నీటితో కడిగితే సమస్య నయమవుతుంది.
- చెంచా త్రిఫల చూర్ణం, అరచెంచా పసుపు, తగినన్ని నీళ్ళు కలిపి ముద్ద చేయాలి. దీన్ని రాత్రి పడుకునే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని పాదాలకు బాగా పట్టించి ఉదయం లేచాక కడుక్కుంటే పగుళ్ళు తగ్గుతాయి. ఇలా వారం రోజుల పాటు చేయాలి.