Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యానికి పెరుగు ఎంతగా ఉపయోగపడుతుందో చర్మ సౌందర్య పరిరక్షణలోనూఅంతే మేలుచేస్తుంది. రోజూ గడ్డపెరుగును ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత చన్నీటితో ముఖం కడుక్కొంటే తగినంత తేమ అందుతుంది. చలికాలంలో పోడూరి చర్మం గలవారికి ఇదెంతో మేలుచేస్తుంది.
- ఎండ, వేడి ధాటికి కమిలిపోయిన చర్మానికి పెరుగు రాస్తే చర్మం పూర్వస్థితిని పొందుతుంది.
- పెరుగులోని బ్యాక్టీరియా చర్మ సమస్యలు రాకుండా చూస్తాయి.
- కప్పు పెరుగులో 2 చెంచాల నిమ్మరసం కలిపి రంగరించి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు రాసి మర్దన చేస్తే కాలుష్యం, దుమ్ము కారణంగా ముఖం మీద చేరి పేరుకుపోయిన మలినాలు, వ్యర్ధాలు, మతకణాలు తొలగిపోతాయి.
- మొటిమలపై పెరుగు, శనగ పిండి మిశ్రమం కలిపి తరచూ రాయటం వల్ల ముఖం మీద జిడ్డు తగ్గి మొటిమల బెడద తగ్గుతుంది.
- చెంచాడు మెంతులు లేదా 2 చెంచాల ఉసిరికాయ పొడి పెరుగులో రాత్రంతా నానబెట్టి తల స్నానానికి గంట ముందుగా తలకి రాసి మరో గంట తర్వాత కుంకుడుగాయ రసంతో తలస్నానం చేస్తే చుండ్రు సమూలంగా తొలగిపోతుంది.
- ఒక తమలపాకుని పెరుగులో 2 గంటలు నానబెట్టి అలసిన కళ్లపై ఉంచుకుంటే వేడి తొలగితాజాగా కనిపిస్తాయి.
- చెంచా చొప్పున శనగపిండి, పెసర పిండి, తేనె, పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి రుద్దుకుంటే దుమ్ము, ధూళి తో పాటు మతకణాలు తొలగి చర్మం సుతారంగా మారుతుంది.
- పావుకప్పు చొప్పున పెరుగు, కలబంద గుజ్జు, చెంచాచొప్పున శనగపిండి, నిమ్మరసం, అరచెంచా బాదం నూనె కలిపి మిశ్రమంగా చేసుకొని దానిని ముఖానికి బాగా పట్టించి మర్దనా చేసి అరగంట తర్వాత చన్నీళ్లతో కడుక్కొంటే ముఖం కాంతివంతమవుతుంది.