Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలంలో సులభంగా తేమ చేరే మూలల్లో పురుగులు చేరతాయి. వంట గదిలో ఈ అవకాశం ఎక్కువ. వంటగదికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పురుగుల సమస్య ఉండదు.
ఆహారపదార్థాలను గాలి చొరబడని డబ్బాల్లో నిల్వచేయాలి. ఆ డబ్బాలను కిచెన్ క్యాబినెట్లో లేదా ఫ్రీజర్లో పెట్టాలి.
- వర్షాకాలంలో తేమ గోడలకు పడుతుంది. వైరింగ్ సరిగా లేకపోతే కరెంటు గోడల గుండా ప్రసరించి షాక్ కొట్టే అవకాశం ఎక్కువ. అందుకని ఎలక్ట్రిక్ వైరింగ్ సరిగా ఉందో లేదో చూడాలి.
- ఎప్పటికప్పుడు షెల్ప్లు శుభ్రం చేస్తే బ్యాక్టీరియా చేరదు.
- వంటగదిలోకి గాలి, వెలుతురు సరిగా రావాలి. ఆ అవకాశం లేదంటే ఫ్యాన్ వాడండి. దానివల్ల గదిలో తేమ చేరదు.
- వంటల తాలూకా వాసనలు పోగొట్టేందుకు బాత్సాల్ట్ను కిచెన్ క్యాబినెట్స్ కింద ఉంచాలి.
- కిచెన్ క్యాబినెట్లను శుభ్రం చేసేందుకు క్రిమిసంహారకాలను వాడాలి. క్యాబినెట్లు శుభ్రం చేశాక తలుపులను కొద్దిసేపు తెరిచి ఉంచాలి. రాత్రి వంట పని పూర్తయ్యాక చెమ్మలేకుండా గట్టు తుడిచేయాలి.
- ఓవెన్, రిఫ్రిజిరేటర్లను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. ఎక్స్పైరీడేట్ పూర్తయిన పదార్థాలను వెంటనే పారేయాలి. అవసరాన్ని బట్టి తక్కువగా కొనుక్కుంటే పారేయాల్సిన అవసరం ఉండదు. అలాగే పదార్థాలు తాజాగా ఉంటాయి. వథా తగ్గుతుంది.