Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మద్యపానం ఓ కల్చర్గా మారిపోతున్నది. తాగడం తప్పనిసరి అనే ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించింది ఓ యువతి. యాంటీ ఆల్కహాలిజం మూమెంట్ను కళాత్మకంగా.. సందేశాత్మకంగా నడిపిస్తున్నది.
బెంగళూరుకు చెందిన పల్లవి చందర్ ఆర్ట్స్ స్టూడెంట్. చిన్నప్పటి నుంచే ఆమెకు కళల పట్ల మక్కువ ఎక్కువ. అప్పటి నుంచే రాసేది కూడా. పెరుగుతున్న కొద్దీ సామాజిక స్పృహ పెరుగుతూ వచ్చింది. బెంగళూరు చిత్రకళా పరిషత్లో విజువల్ ఆర్ట్స్ డిగ్రీ పొందింది. అప్పటి నుంచి సామాజికావసరాల గురించి అనేక ప్రదర్శనలు ఇచ్చింది. సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలు ఎందుకుంటున్నాయో అధ్యయనం చేసిన ఆమె పేదరిక నిర్మూలనపై దృష్టిసారించారు. మద్యపానం.. దాని వల్లనే పేదరికం చాటున నేరాలు పెరిగిపోతున్నాయని భావించారు పల్లవి. బెంగళూరులోని నిరుపేదల పిల్లలందర్నీ ఒక చోటుకు చేర్చి వారిలో యాంటీ ఆల్కహాలిజం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. వాటిని ఏదో పాఠం చెప్పినట్టు చెప్తే బాగుండదనీ నృత్యం.. పెయింటింగ్ రూపాల్లో ప్రదర్శిస్తున్నారు.
ఆల్కహాలిజమ్ పోవాలంటే...
భారత్లో మద్యం వినియోగం గత 12 ఏండ్లలో రెట్టింపైంది. దీంతో అనారోగ్యంపాలై చనిపోయేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలైతే మద్యం వినియోగంలో దేశంలోనే నెంబర్ 1 అని వైద్య నిపుణులు చెబుతున్నారు. మద్యం ఎక్కువగా తాగడం వల్ల 2016లో ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో ప్రతి 20 మరణాల్లో ఒకటి మద్యపానం వల్ల సంభవిస్తోంది. ఇలా అతి మద్యపానం వల్ల చనిపోయిన వారిలో ఎక్కువగా మధ్యతరగతి, పేదవారు ఉంటున్నారు. అతి మద్యపానం వల్ల హింస, గాయాలు, మానసిక సమస్యలు, కేన్సర్, స్ట్రోక్ తదితర అనారోగ్యాలతో చనిపోతున్నారని అధ్యయనలు తెలిపారు. ఈ దుష్పరిణామాలను నియంత్రించేందుకు, ఆరోగ్యవంతమైన సమాజాల అభివృద్ధికి వెంటనే చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. 'అతి మద్యపానం వల్ల చనిపోయేవారిలో 28 శాతం మంది దెబ్బలు తగలడం వల్ల చనిపోతున్నారు. వీరు ఇతరులతో తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, తమనుతాము గాయపరచుకోవడం వల్ల మరణిస్తున్నారు' అని పల్లవి చెబుతున్నారు. ఆల్కహాలిజం పోవాలన్నదే లక్ష్యంగా పెట్టుకొని కళల ద్వారా ఉద్యమం ప్రారంభించిన ఆమెను బెంగళూరు ప్రజలు అభినందిస్తున్నారు. ు