Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలకి ఆర్నెళ్లు వచ్చేదాకా నీళ్లు పట్టించవద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. తల్లిపాలు/ పోత పాలు తప్ప మరేదీ అందించవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. మరి అందుకు గల కారణాలు తెలుసుకోవాలంటే ఇది చదవండి...
- తల్లిపాలలో పోషకపదార్థాలతో పాటుగా 80 శాతం నీరు ఉంటుంది. ఈ నీరు పిల్లల అవసరాలకి తప్పకుండా సరిపోతుంది. ఇది కాకుండా పైనుంచి మంచినీరు అందిస్తే వారి శరీరం తట్టుకోలేదు. ఎందుకంటే పసిపిల్లల కిడ్నీలు ఇంకా పూర్తిస్థాయిలో అభివద్ధి చెంది ఉండవు. దాంతో నీటితో పాటుగా శరీరం నుంచి సోడియం అనే ముఖ్యమైన ఖనిజం కూడా మూత్రం ద్వారా వెళ్లిపోతుంది. - ఇది పిల్లల మెదడు మీద ప్రభావం చూపుతుంది. మత్తులోకి జారిపోవడం, మొహం ఉబ్బిపోవడం, ఫిట్స్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లవాడి శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది. వాంతులు, విరేచనాలు కూడా మొదలవ్వవచ్చు. ఈ ప్రాథమిక లక్షణాలను కనుక అశ్రద్ధ చేస్తే, పిల్లవాడు ఏకంగా కోమాలోకి జారిపోయే ప్రమాదం ఉంటుందట.
- పిల్లలకి నీళ్లు పట్టించడం వల్ల ఏర్పడే మరో ప్రమాదం పోషకాహారలోపం! పిల్లలకి నీళ్లు పట్టించగానే వారి చిన్ని పొట్ట కాస్తా నిండిపోతుంది. దాంతో తల్లిపాలు తాగడం తగ్గించేస్తారు లేదా పూర్తిగా మానేస్తారు. ఆ వయసు పిల్లలకి తల్లిపాలే ఆధారం కాబట్టి, ఇది పోషకాహార లోపానికి దారితీస్తుంది. పిల్లలకి బయటి నీళ్లు పట్టడం వల్ల విరేచనాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. పసిపిల్లలలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, వాళ్లకి బయటి నుంచి పట్టే నీరు ఏమాత్రం తేడాగా ఉన్నా జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది.