Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజూ గుప్పెడు శనగలు తింటే వీటిలోని ప్రొటీన్ల మూలంగా శరీర అవసరాలకు తగిన శక్తి సమకూరుతుంది. శనగల వినియోగం వల్ల శరీర రోగనిరోధక శక్తిని పెంచి పలు రోగాలు రాకుండా చేస్తుంది.శనగల్లోని మాంగనీస్, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి. శనగల మొలకల్లో పుష్కలంగా ఉండే పీచు మలబద్దకాన్ని వదిలించి జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది.
మధుమేహులు రోజూ గుప్పెడు నానిన శనగలు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.శనగలలో ఉండే ఐరన్ మూలంగా మహిళల్లో కనిపించే రక్తహీనత సమస్య దూరమవుతుంది. రక్తపోటు బాధితులు రోజూ గుప్పెడు నానిన శనగలు తింటే వాటిలోని పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాల మూలంగా రక్తపోటు అదుపులో ఉండటమే గాక హదయ సమస్యల ముప్పు కూడా తగ్గుతుంది.మాంసం తిని అరిగించుకోలేని వారు శనగలు తిన్నా మాంసంతో సమానమైన ప్రోటీన్లు లభించినట్లే. శనగల్లోని ఎమినో యాసిడ్స్ రక్తకణాల ఎదుగుదలకి దోహదపడతాయి. శనగల వినియోగంతో శరీరంలోని అధిక కొవ్వు కరగటమే గాక చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.శనగలు తిన్నప్పుడు చాలా సమయం ఆకలికాదు. కనుక బరువు తగ్గించుకోవాలనుకొనే వారు రోజూ గుప్పెడు నానిన శనగలు తినొచ్చు. నిద్రలేమి, పచ్చ కామెర్లు, చర్మ సమస్యలకు శనగల వినియోగం మేలు చేస్తుంది.