Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖాన్ని రసాయనాలతో తయారుచేసిన సబ్బుతో రుద్దుకునేకంటే మెత్తని శనగ పిండితో రుద్దుకోవడం వల్ల చర్మం మదువుగాను, కాంతిగానూ ఉంటుంది.
బీట్రూట్ రసాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.
శనగపిండిలో కీరా దోసకాయ రసాన్ని కానీ, క్యారెట్ రసాన్ని కానీ కలిపి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి ఓ గంట తర్వాత ముఖాన్ని పరిశుభ్రమయిన నీటితో కడిగితే ముఖ చర్మపు కాంతి పెరుగుతుంది.
గులాబీ రెక్కల పేస్టును ముఖానికి పట్టించి, అరగంట తర్వాత ముఖాన్ని కడిగితే ముఖం ఎంతో మదువు గానూ, ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది.
గ్లిజరిన్లో నిమ్మరసం, టమాటరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖ సౌందర్యం పెరుగుతుంది.
పాలల్లో దూదిని తడిపి, దూదిలో తేమ ఆరిపోయేంత వరకు ఆ దూదిని కళ్ళమీద ఉంచుకుంటే కళ్ళు కాంతితో మెరుస్తుంటాయి.
తాజా పండ్లు, పాలు ముఖచర్మపు సోయగాన్ని, ఆకర్షణనూ పెంచుతాయి.
ఎండిన కమలాఫలం తొక్కలను మెత్తని పొడిచేసి, ఆ పొడిలో పసుపు, శనగపిండి కలిపి అందులో రోజ్వాటర్ పోసి మెత్తని పేస్ట్చేసి ముఖానికి పట్టించాలి. కొంతసేపయిన తర్వాత ముఖం కడుక్కుంటే చర్మం మదువుగానూ, కాంతిమంతంగానూ కనిపిస్తుంది.
జిడ్డు చర్మం ఉన్నవారు ముఖ సౌందర్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖానికి జిడ్డు లేకుండా ఉండటానికి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి. సబ్బుకు బదులు మెత్తని సున్నిపిండిని వాడాలి. బయట నుంచి రాగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి.
కళ్ళు చికిలిస్తూ చూడటం, ముఖం చిట్లించడం, కోపంతో పళ్ళు కొరకడం లాంటివి ముఖ సౌందర్యానికి అవరోధం కలిగిస్తాయి. ముఖ చర్మానికి ముడతలు ఏర్పడుతాయి. అటువంటి అలవాట్లను మానుకోవాలి.
బాదం నూనెలో శనగపిండి, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు మచ్చలు పోవడమే కాదు, ముఖం మదువుగా కనిపిస్తుంది. ప